ఇంగ్లాండ్ వేదికగా జరుగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్స్ లో అతిథ్య జట్టు చేతిలో ఓటమి పాలైన తరువాత ఏం జరిగింది..? జట్టు సభ్యులు ఈ పరాజయాన్ని తేలిగ్గా తీసుకున్నారా..? లేక ఇది వారిని తీవ్రంగా భాధించిందా..? అంటే అందుకు సంబంధించిన విషయాలను టీమిండియా వైస్ కెప్టెన్, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వివరించారు. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో జట్టు సభ్యులందరం ఏడ్చేశామని తెలిపింది. విజయానికి అతి చేరువగా వచ్చి ఓటమి పాలవ్వడంతో దానిని జీర్ణంచుకోలేకపోయామని తెలిపింది. జట్టు మొత్తాన్ని ఈ పరాజయం కలచివేసింది. దీంతో ఏ ఒక్కరూ కన్నీటిని ఆపుకోలేకపోయారని.. ఒక్కర్నీ చూడగానే మరోకరి కంట్లోంచి నీళ్లు వచ్చేశాయని.. అందరం ఏడ్చేశామని తెలిపింది.
జట్టు యాజమాన్య సిబ్బంది మమ్ముల్ని బాధపడొద్దని చెబుతూనే ఉన్నా.. తాము మాత్రం బాధను ఆపుకోలేకపోయామని చెప్పింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం తమ బాధ తగ్గిందని అన్నారు. ఆ తరువాత హోటల్కి చేరుకునే సమయంలో ఇక విచారించడం సబబు కాదని, ఫైనల్ వరకు చేరినందుకు రన్నర్ అప్ గా నిలిచినందుకు సంతోషించాలని జట్టు సిబ్బంది పదే పదే చెప్పడంతో విందు ఆరగిస్తూ వేడుకలు చేసుకున్నామని చెప్పింది. తన జట్టుని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాననింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరడం తనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని తెలిపింది.. అంతేకాదు ఈ టోర్నీలో మేము అద్భుతంగా ఆడాము. ఇక గతం మర్చిపోయి... విజయాల కోసం పోరాడుతూ ముందుకు దూసుకెళ్లాగలం అన్న విశ్వాసం మాలోని ప్రతీ ఒక్కరిలో వుందని కౌర్ తెలిపింది. క్రికెట్ ఆడటం తన కల అని.. తన కలతోనే జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని తాను భావిస్తున్నానని చెప్పారు. మహిళా క్రికెట్ పట్ల ఇప్పుడిప్పుడే మన దేశంలో అవగాహన పెరుగుతోందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more