భారత్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం ఆతిధ్య జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ తన నాయకత్వ పగ్గాలను వదులుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు అత్యధిక మ్యాచ్లకు సారథిగా వ్యవహరించిన ఘనతను సొంతం చేసుకోబోతున్న ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలను ఇచ్చారు.? అసలు అయనిచ్చిన సంకేతాలేంటి..? అంటే తన కెప్టెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలే.
భారత్తో సిరీస్ తరువాత తాను కేవలం ఓపెనర్గానే జట్టులో కొనసాగుతాననే సంకేతాలను ఇచ్చాడు. తాను టెస్టు కెరీర్ను యాథావిధిగా కొనసాగించాలనుకుంటున్నానని, అదే సమయంలో ఓపెనర్గా తన ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ తన కెప్టెన్సీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలను కుక్ చేయలేదు. దాంతో భారత్ తో సిరీస్ అతనికి కెప్టెన్ గా చివరి సిరీస్ కావొచ్చని భావిస్తున్నారు.
2012లో ఇంగ్లండ్ జట్టుకు కుక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదే ఏడాది భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తో గెలుచుకుంది. ఇప్పటివరకూ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 24 టెస్టులను గెలిచింది. అదే క్రమంలో రెండు యాషెస్ సిరీస్లను కూడా ఇంగ్లండ్ జట్టు కుక్ సారథ్యంలో సొంతం చేసుకుంది. 2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు కెరీర్ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్.. 10, 688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more