విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ప్రేక్షకులకు ఓ అరుదైన దృశ్యానికి సాక్షిగా నిలిచారు. భారత క్రికెట్ అభిమానులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అంటే క్రికెట్ దేవుడు. కేవలం క్రికెట్ అభిమానులకే కాదు సచిన్ రమేష్ టెండుల్కర్ అంటే క్రికెటర్లకు, ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లకు కూడా ఆరాధ్యుడే. సచిన్ టెండూల్కర్ అంటే యువరాజ్ సింగ్ కు ఎనలేని గౌరవం. యువీ సచిన్ ను ఎంతో అభిమానిస్తాడు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో యువీ.. మాస్టర్ కు పాదాభివందనం చేసి తన గౌరవాన్ని చాటుకున్నాడు. వైజాగ్ లో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు యువీ ప్రాతినిధ్యం వహించగా, ముంబై ఇండియన్స్ కు సచిన్ మెంటర్ గా ఉన్నాడు. వైజాగ్ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం యువీ సచిన్ దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కారం చేశాడు. ఈ మ్యాచ్ యువరాజ్ కి వందో ఐపీఎల్ మ్యాచ్. యువీ 23 బంతుల్లో 39 పరుగులు చేయడం సంతోషంగా ఉందని సచిన్ ప్రశంసించాడు. కాగా యువీ సచిన్ కు పాదాభివందనం చేయడమిదే తొలిసారి కాదు. 2014 జులైలో లండన్ లోని లార్డ్స్ ద్విశతసంవత్సరాల వేడుకల సందర్భంగా జరిగిన మ్యాచ్ లో యువీ సచిన్ పాదాలకు నమస్కరించాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more