ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్కతా నైట్ రైడర్ప్.. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆ జట్టు ప్రధాన కోచ్ జాక్వస్ కల్లిస్ మాత్రం ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుత పొజిషన్ను చూసి మురిసిపోవడం కంటే కొంత జాగురతతో ఉండాలని హిత బోధ చేశాడు. గత ఏడాది కూడా ఇదే స్థితిలోఉన్న జట్టు ఆకస్మికంగా వెనుకబడి పోయిన సంగతి ప్రతీ ఒక్క ఆటగాడు గుర్తించుకోవాలన్నాడు.
'జట్టు టాప్లో కొనసాగుతుండటం సంతోషించదగ్గ విషయమే. ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాం. గతేడాది కూడా కోల్ కతా నైట్ రైడర్స్ ఆదిలో ఆకట్టుకుని ఆ తరువాత చతికిలబడింది. 2015లో ఈడెన్ గార్డెన్లో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఒక పరుగు తేడాతో అద్భుత విజయాన్ని సాధించి పోల్ పొజిషన్ రేసులో నిలిచింది. అయితే ఆ తరువాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన వరుస మ్యాచ్ల్లో ఓటమి చెందాం. దాంతో ప్లే ఆఫ్ బెర్తును కోల్పోయి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడితే మంచిది'అని కల్లిస్ ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈడెన్ గార్డెన్స్లో బుధవారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ పై కోల్ కతా ఏడు పరుగుల తేడాతో గెలిచిన అనంతరం ఆనాటి మ్యాచ్ ను కల్లిస్ జ్ఞప్తికి తెచ్చుకోవడం గమనార్హం.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more