ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ లో భారత్, పాక్ జట్ల మధ్య ఈ నెల 19న జరగనున్న హైటెన్షన్ మ్యాచ్ పై అలుముకున్న నీలినీడలు తొలగిపోనున్నాయి. తమ జట్టు ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియాన్ని నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ కు మార్చినా.. తమ ఆటగాళ్ల భద్రతపై బిసిసిఐ నుంచి ఎలాంటి లిఖిత పూర్వక హామీ లభించలేదని మెలికపెట్టిన పిసీబికి.. పాకిస్థాన్ క్రికెటర్ల బధ్రత తమదని ఐసీసీ నుంచి ఒకటి, భారత్ నుంచి రెండు లేఖలు అందాయని సమాచారం.
తమ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తూ భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొంటుందని ఆ దేశ క్రికెట్ చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు. 'మా జట్టు భారత్ లో పర్యటనకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. భారత్ లో జరిగే వరల్డ్ టీ 20లో మిగతా ఏ జట్టును టార్గెట్ చేయడం లేదు. మా పాకిస్తాన్ జట్టునే అంతా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతో మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. వారి హామీ కోసం ఎదురుచూస్తున్నాం' అని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు.
అయితే షహర్యార్ ఖాన్ భారత్ నుంచి ఎలాంటి లిఖిత పూర్వక హామీ లభించలేదని, వాటి కోసమే ఎదురుచూస్తున్నామన్న వాఖ్యలు సత్యదూరమని తెలుస్తుంది. భారత్ నుంచి అనగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి పాక్ క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని లిఖితపూర్వక లేఖ వెళ్లిందని, దీంతో పాటు కొల్ కత్తా పోలీసు ఉన్నతాధికారి కూడా తాము పాకిస్థాన్ క్రీడాకారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కోంటూ మరో లేఖను అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమని జాతీయ మీడియా పేర్కోంది. వీరితో పాటు ఐసీసీ కూడా పాక్ క్రికెటర్ల భాద్యతపై పీసీబికి లేఖ రాసిందని సమాచారం.
తమ ఆటగాళ్లు అక్కడ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదని, భారత ప్రభుత్వంనుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తమ జట్టు భారత్కు బయల్దేరమని అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి పేర్కొన్నారు. లక్ష మంది సామర్థ్యం గల ఈడెన్గార్డెన్స్లోకి ఎవరైనా అవాంఛిత వ్యక్తులు వస్తే ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. దాంతో స్పందించిన క్యాబ్.. తమ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక హామీని ఐసీసీకి అందజేసింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more