భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టి-20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. చివర వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలతో రాణించగా, చావోరేవో అనేలా సాగిన చివరి ఓవర్లో సిక్స్, ఫోర్తో యువరాజ్ సింగ్ టీమిండియాను విజయం ముంగిట నిలబెట్టాడు. రైనా 25 బంతుల్లో 49 పరుగులు చేసి, చివరి బంతికి ఫోర్ చేసి విన్నింగ్ షాట్ చేశాడు. ఈ విజయంతో టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా టి-20 సిరీస్ను గెలిచి సత్తా చాటింది.
లాస్ట్ ఓవర్లో ఒక్కో బాల్.. ఏం జరుగుతుందా అన్న టెన్షన్ ను క్రియేట్ చేసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ స్టేడియంలో అందరికి నరాలు తెగే టెన్షన్ ను, ఇంట్రస్ట్ ను కలిగించిన చివరి ఓవర్ లో ప్రతి బాల్ అభిమానుల గుండెల్లో రైలు పరుగెత్తించింది. చివరి ఓవర్ ఎలా సాగిందో చూడండి.
ఫస్ట్ బాల్.. యువరాజ్ సింగ్ ఫోర్
సెకండ్ బాల్.. సిక్స్
ధర్డ్ బాల్.. వన్ రన్
ఫోర్త్ బాల్.. టూ రన్స్
ఫిఫ్త్ బాల్.. టూ రన్స్
సిక్త్స్ బాల్.. ఫోర్
భారత్ తో జరుగుతున్న ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 197 భారీ స్కోరు చేసింది. షేన్ వాట్సన్ 124( 74 బంతులలో 10 ఫోర్లు 6 సిక్సర్లు ) పరుగులతో అజేయ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఖవాజా (6 బంతుల్లో 14 పరుగులు) ఔటయ్యాడు. 3వ ఓవర్ లో రెండో బంతికి మీడియం పేసర్ నెహ్రా ఓపెనర్ ఖవాజాను పెవిలియన్ కు పంపాడు. 69 పరుగుల టీమ్ స్కోర్ వద్ద మార్ష్ (12 బంతుల్లో 9 పరుగులు) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్ లో మార్ష్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 168 పరుగుల వద్ద హెడ్(26 పరుగులు ), 193 పరుగుల వద్ద లైన్ (13 పరుగులు) జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత బౌలింగ్ లో నెహ్రా , బుమ్ రా , అశ్విన్ జడేజా , యువరాజ్ సింగ్ తలా ఒక వికెట్ లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more