మెల్బోర్న్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ల మధ్య జరుగుతున్న 2వ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 345 పరుగులు చేయగా 3 వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ ఆతిథ్య జట్టును బ్యాటింగ్కి పిలిచింది. ఉస్మాన్ ఖ్వాజా (144 పరుగులు), బర్న్స్ (128 పరుగులు)లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరు 2వ వికెట్కు 258 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు. కాగా టేలర్ బౌలింగ్లోనే వీరిద్దరూ ఔటయ్యారు.
ప్రస్తుతం స్మిత్ (32 పరుగులు), ఆడమ్ ఓజెస్ (10 పరుగులు)లు క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో టేలర్ 2 వికెట్లు, బ్రత్ వెయిట్ 1 వికెట్ తీశారు. 3 టెస్ట్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 2వ టెస్టులోనైనా ఆస్ట్రేలియా దాటికి విండీస్ ఎదురొడ్డి నిలబడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more