భారత్, పాకిస్థాన్ సిరీస్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ నుంచి తమకు అధికారికంగా అహ్వానం అందిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య గతంలో ఓప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. చివరి వరకు రెండు దాయాధి దేశాల మధ్య సిరీస్ కొనసాగుతుందా అన్న సందేహాలకు తెరలేచింది. కాగా ఇవాళ పాకిస్థాన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్ తో క్రికెట్ సిరీస్ అడేందుకు అధికారికంగా తమకు అహ్వానం అందిందని తెలిపారు.
కాగా గతంలో కదుర్చుకున్న ఓప్పందం మేరకు తటస్థ వేదికపై కాకుండా భారత్ లో ఈ సిరీస్ ను నిర్వహిస్తామని, పాకిస్థాన్ ఈ మేరకు సుముఖత వ్యక్తం చేస్తే తదుపరి సమాచారం అందించాలని వారు కోరినట్లు షహర్యార్ ఖాన్ తెలిపారు. భారత్ లోని మోహాలి, కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ ను వేదికగా కూడా నిర్ణయించారని ఆయన తెలిపారు. అయితే తాము మాత్రం తటస్థ వేదికపైనే ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని కోరుతున్నామని చెప్పారు. భారత్ లో తమ క్రికెట్ జట్టు సభ్యులకు అభధ్రత పోంచివుందన్న కారణంగా తాము ఈ నిర్ణయానికి కట్టుబడి వున్నామని తెలిపారు. అయితే ఇందుకు భారత్ అంగీకరించని పక్షంలో బిసిసిఐ డబ్బును కోల్పోవల్సి వస్తుందని షహర్యార్ ఖాన్ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more