దక్షిణాఫ్రికాతో రాజ్ కోట్ వేదికగా జరుగిన మూడో వన్డేలో చతికిల పడిన టీమిండియా రేపు చెన్నై వేదికగా జరగనున్న మ్యాచ్ లో సిరీస్ ను సమం చేయాలని ఉవ్విళ్లూరుతుంది. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా గురువారమిక్కడ జరిగే నాలుగో మ్యాచ్లో బరిలో దిగుతోంది. వన్డే సిరీస్ విజయావకాశాలను కాపాడుకోవాలంటే ధోనీసేన ఈ మ్యాచ్లో గెలిచితీరాలి. లేకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సఫారీలకు సమర్పించుకోక తప్పదు. ఈ సిరీస్లో సఫారీలు 2-1తో ముందంజలో ఉన్నారు.
చెన్నై వన్డేలో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసి, తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ధోనీసేన ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియాతో పాటు కెప్టెన్గా ధోనీకి ఎంతో కీలకం. భారత్కు బ్యాటింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. నిలకడలేమి వల్ల గెలవాల్సిన మ్యాచ్ల్లో చేజేతులా ఓడిపోతున్నారు. తొలి, మూడో వన్డేల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ ఓటమి చవిచూసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ రైనా మూడు వన్డేల్లో కలిపి మూడే పరుగులు చేశాడు.
బ్యాటింగ్ సమస్యలకు తోడు టీమిండియాకు కొత్త సమస్య వచ్చిపడింది. స్పిన్నర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెన్నై మ్యాచ్లో మిశ్రా ఆడేది సందేహంగా మారింది. ఇక ధోనీ కెప్టెన్సీపై కత్తివేలాడుతోంది. ఈ సిరీస్ ఓడిపోతే ధోనీపై ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చెన్నై వన్డే గెలవాలంటే ధోనీసేన సమష్టిగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు సఫారీలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమరోత్సాహంతో ఉన్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more