హమ్మయ్యా.. ఎట్టకేలకు 22 ఏళ్ల భారత్ కలను కోహ్లీ సేన సాకారం చేసింది. కొలంబో వేదికగా శ్రీలంకతో ఆడిన మూడో టెస్టు మ్యాచులో 117 పరుగుల తేడాతో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. మొదటి టెస్టు మ్యాచ్ అత్యంత దారుణంగా ఓడిపోయిన క్రమంలో ఈ సిరీస్ ఇండియా చేతి నుంచి జారిపోతుందని అంతా భావించారు. కోహ్లీ సేనకు అంత సమర్థత లేదని ప్రతిఒక్కరూ అవహేళన చేశారు. కానీ.. ఆ విధంగా వచ్చిన విమర్శలను కోహ్లీ సేన విజయంతో తిప్పికొట్టింది.
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా విజయం సాధించాల్సిన దశలో ఓటమిపాలై.. సంగక్కర, జయవర్థనేలాంటి సమర్థవంతమైన సీనియర్ ఆటగాళ్లు లేని జట్టుపై విజయం సాధించని టీమిండియా వేస్టు అన్న తీవ్ర విమర్శలకు గురైంది. ఓటమి నేర్పిన పాఠమో లేక విజయం సాధించాలన్న పట్టుదలో తెలీదు కానీ.. రెండో టెస్టులో పుంజుకుని విజయం సాధించి సిరీస్ సమం చేసింది. ఇక ఎంతో కీలకమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ ఉస్సురనిపించినా.. పుజారా చివరిదాకా నిలబడిన భారత్ ను ఒడ్డున పడేశాడు. దీంతో టీమిండియా మంచి స్కోరే నమోదు చేసింది. ఈఇక ఈ ఇన్నింగ్స్ లోనే భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో లంకేయులు వరుసగా పవెలియన్ దారిపట్టారు. వీరి దెబ్బకు లంక ఆటగాళ్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్ మంచి స్కోరుతోనే లీడింగ్ లో నిలవగలిగింది.
ఇక రెండో ఇన్నింగ్స్ మొదలైన ఆదిలోనే ఇండియా టాప్ ఆర్డర్ పవెలియన్ కు చేరిపోవడంతో భారత్ కి గట్టి దెబ్బే తగిలిందని ఊహించారు కానీ.. మిడిలార్డర్, టెయిలెండర్ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో విజయానికి అవసరమైన పరుగులు సాధించగలిగింది. లంకకు 386 పరుగుల లక్ష్యాన్ని నిరర్దేశించింది. 386 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టుకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. భారత్ పేసర్లకు లంక టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. దీంతో విజయం భారత్ కే వరిస్తుందని అప్పటికే ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్లుగానే ఐదోరోజు టీమిండియా లంకేయులకు కళ్లెం వేసి.. 117 పరుగుల భారీ వ్యత్యాసంతో విజయం సాధించింది.
టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించగా, మూడు వికెట్లతో ఇషాంత్, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్, ఒక వికెట్ తో మిశ్రా చక్కని సహకారమందించారు. బౌలర్లు రాణించడంతో టీమిండియా లంకేయులను 268 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇండియా ఈ టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో పూర్తి స్థాయి టెస్టు సిరీస్ గెలుచుకున్న కెప్టెన్ గా కోహ్లీ టీమిండియా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నాడు. ఈ టెస్టు ద్వారా ఇషాంత్ శర్మ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more