టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న కీలక మూడో టెస్టు మ్యాచులో ఇరువర్గాల ఆటగాళ్ల మధ్య అరుదైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. నాలుగో రోజు ఆటలో భాగంగా కొందరు ఆటగాళ్లు నియమాలను అతిక్రమించి వాగ్వాదానికి దిగారు. ఒకరిపైమరొకరు తిట్లు సంధించుకున్నారు. ఆటగాళ్లతోపాటు అందరికీ ఆందోళనకు గురిచేసిన ఈ ఉదంతాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందుకు కారకులైన ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడో టెస్టులో భారత పేసర్ ఇషాంత్ శర్మ తన ప్రతిభతో లంక ఆటగాళ్లను చమటలు పట్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో వరుసగా వికెట్లు తీసిన ఇతగాడు.. ఈ సందర్భంగానే ఓ లంక క్రికెటర్ తో వాగ్వాదానికి దిగాడు. తాను బౌలింగ్ వేసేంతవరకు అలాగే ప్రవర్తించాడు కూడా. ఇక నాలుగోరోజు ఆట సందర్భంగా.. ఇషాంత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఘర్షణకు దిగాడు. తనను ఇబ్బంది పెట్టేందుకు లంక బౌలర్ దమ్మిక ప్రసాద్ వరుసగా బౌన్సర్లు విసురుతుంటే.. వాటిని చిరునవ్వుతో ఇషాంత్ తప్పించుకుంటూ, నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలోనే బౌలర్ దగ్గరకు వెళ్లి.. ‘మరో బౌన్సర్ వేస్తావా?’ అంటూ తల చూపించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్.. ఇషాంత్ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పగా.. అందుకు ఇషాంత్ సైతం కోపంగా సమాధానం చెప్పాడు. వీరిద్దరి మధ్య చండీమల్ వచ్చి నోరు జారడంతో.. అంపైర్లు కల్పించుకోవాల్సి వచ్చింది.
ఆ కథ అప్పటికి ముగిసిందనుకుంటే తప్పే. రెండో ఇన్నింగ్స్ లోనూ అలాగే కొనసాగింది. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా చండీమల్ వికెట్ తీసిన ఆనందంలో ఇషాంత్ తనదైన శైలిలో ప్రదర్శించాడు. చండీమల్ అవుట్ కాగానే.. చేత్తో తన తలను బాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు. అది చూసిన చండీమల్.. కోపంగా ఏదో అనుకుంటూ పెవీలియన్ చేరాడు. ఇక మరో సందర్భంలో తిరిమానే కూడా వాగ్వాదానికి దిగిన సందర్భం వుంది. ఇలా.. ప్రవర్తించిన నేపథ్యంలో ఇషాంత్ శర్మ, లంక ఆటగాళ్లు చండిమాల్, తిరిమానే, దమ్మిక ప్రసాద్ లపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని ఐసీసీ నిర్ణయించింది. ఆ ఘటనపై విచారణ జరిపి, ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని ఐసీసీ అధికారులు పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more