ప్రస్తుతం ఇండియా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్ లో వున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగానే ఇండియా - ఇంగ్లాండ్ జట్టు మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ కూడా అయిపోయింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత క్రికెట్ స్పిన్నర్ జడేజా, ఇంగ్లాండ్ పేసర్ జిమ్మీ అండర్ సన్ మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీనిపై టీమిండియా మేనేజ్ మెంట్ మండిపడింది.
ట్రంట్ బ్రిడ్జ్ టెస్ట్ సందర్భంగా రవీంద్రా జడేజాను ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ అండర్సన్ దూషించినట్టు టీమిండియా మేనేజ్ మెంట్ అతడినపై రిఫరీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్ సందర్భంగా రెండో రోజు మైదానం నుంచి వెలుపలికి వస్తున్న సందర్భంలో.. అండర్సన్, జడేజాను ఉద్దేశించి నోరు పారేసుకున్నాడు. దీంతో అది పెద్ద వివాదంగా మారిపోయింది. ఆ సమయంలో జడేజా కూడా అతనికి ధీటుగానే సమాధానం ఇచ్చాడు. అయితే పరదేశంలో ఒక ఆటగాడ్ని ఇలా దూషించడం ఎంతవరకు సమంజసమని భావించిన ఇండియా మేనేజ్ మెంట్ అతనిపై ఆగ్రహంతో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై భారత జట్టు మేనేజర్ అయిన సునీల్ దేవ్ ఫిర్యాదు చేయడంతో ఐసీసీ విచారణ చేపట్టేందుకు ఉపక్రమించింది. ఐసీసీ నియమావళి ప్రకారం అండర్సన్ పై లెవల్ 3 అభియోగాలు మోపారు. ఇదిలా వుండగా.. తమ పేసర్ జిమ్మీపై ఈ విధంగా లెవల్ 3 అభియోగాలు మోపడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా కౌంటర్ కు సిద్ధమైంది. జడేజా, అండర్సన్ పై చేస్తున్న ఆరోపణలను సవాల్ చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ అండర్సన్ తప్పు చేసినట్లు రుజువైతే.. అతనిపై 4 టెస్టులు లేదా 8 వన్డే మ్యాచులు నిషేధం విధించే అవకాశం వుందని చెబుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more