(Image source from: Indian team fails to maintain high score)
భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ట్రెంట్రిడ్జ్ టెస్టులో... ఇండియాకు తీరని నిరాశే మిగిలింది. అత్యధిక ఆధిక్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో భారత బౌలర్లు తమ పనితీరును వేగవంతం చేసినా.. ఫలితం లేకపోయింది. చేతికి అంది వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను ధోనీ సేన చేజార్చుకుంది. తొలుత భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకుపోయిన భారత్... చివర్లో తన పట్టును వదులుకుంది.
మ్యాచ్ మొదలైన మొదట్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు చూపించిన భారత బౌలర్లు... చివరి వికెట్ కోసం మాత్ర నానాతంటాలు పడ్డారు. భువనేశ్వర్ కుమార్, షమి, ఇషాంత్ శర్మలు ఇంగ్లాండ్ ఆటగాళ్లను భయపెట్టించి, వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు. దీంతో అతిథ్య టీం వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ.. తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయింది. వరుసగా తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఇక ఇండియాదే ఆధిక్యం అన్న నేపథ్యంలో చివరి వికెట్ కి వచ్చేసరికి ప్లేటు మొత్తం మారిపోయింది.
ఇంగ్లాండ్ ఆటగాడు అయిన జోయ్ రూట్ 158 బంతుల్లో 78 పరుగులు చేసి, మూడు కీలక భాగస్వాములు నమోదు చేసి, జట్టుకు అండగా నిలిచాడు. ఇతని ముందు వరుసగా వికెట్లు పడిపోతున్నా... ఇతను మాత్రం తటస్థంగానే వుంటూ భాగస్వాములు జోడించుకుంటూ ఇంగ్లాండ్ జట్టుకు స్కోరును జోడించాడు. చివరలో అండర్ సన్ కూడా 23 పరుగులో క్రీజులోనే పాతుకుపోయాడు. వీరిద్దరు కలిసి 54 పరుగులు జోడించారు. దీంతో మూడోరోజు ఆట ముగిసేసరికి 9 వికెట్లకు 352 పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో నమోదయ్యాయి. భారత్ కంటే 105 పరుగులు వెనుకబడి వున్నప్పటికీ.. భారత్ కు మాత్రం చేదు అనుభవమే ఎదురయింది. భారీ స్కోరు ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more