Saina nehwal and pv sindhu enters second round in denmark open super series

saina nehwal, pv sindhu, parupalli kashyap, saina nehwal latest news, saina nehwal hot photos, saina nehwal denmark open super series, pv sindhu latest news, pv sindhu denmark open super series, saina nehwal pv sindhu, gutta jwala latest news, gutta jwala hot photos, gutta jwala hot photo shoot, gutta jwala denmark open super series, ashwini ponnappa

saina nehwal pv sindhu and parupalli kashyap enters second round in denmark open super series

‘‘ఓపెన్’’లో చెలరేగిపోయిన సైనా - సింధు!

Posted: 10/16/2014 01:56 PM IST
Saina nehwal and pv sindhu enters second round in denmark open super series

తమదైన నైపుణ్యంతో గతంలో జరిగిన బ్యాడ్మింటన్ క్రీడల్లో పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, పివి సింధులు... ఇటీవలే కాలంలో మాత్రం తమ ఆటతీరుతో అందర్నీ నిరాశపరిచేశారు. ఆసియా క్రీడల్లో ఏ ఒక్క పతకాన్ని సాధించలేకపోయిన వీళ్లిద్దరూ... డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లో ఎట్టిపరిస్థితుల్లోనూ పతకాలు నెగ్గాలనే పంథంతో బరిలోకి దిగారు. ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగిన ఈ ఇద్దరు ఆటగాళ్లూ... ఆ సిరీస్ లో శుభారంభం చేశారు. సెనా నెహ్వాల్, పివి సింధు తమ అద్భుత ప్రతిభతో ప్రత్యర్థులను ఓడించి, రెండో రౌండ్ లోకి దూసుకెళ్లారు.

మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో సైనా నెహ్వాల 12-21, 21-10, 21-12 స్కోరుతో జర్మనీకి చెందిన కరిన్ కరిన్ చ్నాసేపై విజయం సాధించింది. మొదటి రౌండ్ లో తొలి గేమ్ న కోల్పోయిన సైనా... తర్వాత తన వేగాన్ని పుంజుకుని, అద్భుతంగా విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్ లో సింధు 21-13, 22-20 స్కోరుతో హాంకాంగ్ కు చెందిన పుయ్ ఇన్ ఇవ్ను చిత్తుచేసింది. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా తొలి గేమ్ నుంచి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సింధు... ప్రత్యర్థిని ఓడించేసింది. సైనా కంటే తనే బెస్ట్ అని అభిమానుల నుంచి అనిపించుకుంది.

ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో కశ్యప్ 21-15, 21-18 స్కోరుతో ఇంగ్లాండ్ కు చెందిన రాజీవ్ ఉసెవ్ పై గెలిచాడు. అలాగే కిదాంబి శ్రీకాంత్ 21-15, 17-21, 21-18 తో చైనాకు చెందిన జు సాంగ్ పై అద్భుతంగా విజయం సాధించాడు. అయితే మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని పొన్నప్పకు చుక్కెదురైంది. రష్యాకు చెందిన వ్లాదిమిర్ ఇవనోవ్ తో జతకట్టిన అశ్విని 18-21, 18-21తో యున్ లుంగ్ చాన్-ఇంగ్ సు సె జంట చేతిలో పరాజయం పాలయ్యింది. అలాగే మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప, గుత్తా జ్వాల 17-21, 15-21తో ముస్కెన్స్ - సెలెనా పీక్ జంట చేతిలో ఓడిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles