ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1980లోనే తనను బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కి అధ్యక్షుడిగా ఉండమన్నారని, అయితే ఎన్నడూ బ్యాట్ పట్టని తానకు ఆ పదవి ఎందుకని తిరస్కరించానని, అదే సమయంలో ఆ స్థానానికి ఎన్కేపీ సాల్వా పేరును తానే ప్రతిపాదించానని వివరించారు. రాష్టప్రతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ముఖర్జీ సాల్వాతో తన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తనకు సన్నిహితులైన కొందరు 1982లో కూడా తనవద్ద బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించారని, అప్పుడు కూడా తాను వారితో ఒక్కటే చెప్పానని, ఎన్నడూ క్రికెట్ ఆడని తాను దానికి సరిపోను కాబట్టి ఆ స్థానానికి న్యాయం చేయలేని తిరస్కరించినట్లు చెప్పారు. కానీ తాను కూడా క్రికెట్కు సంబధించిన సాహిత్యాన్ని చదివానని, అప్పుడప్పుడు క్రికెట్ కూడా చూసేవాడినని వివరించారు. కానీ తాను ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ మాత్రం పట్టలేదని చెప్పుకొచ్చారు. ఈసారి తాను ప్రతిపాదించిన కాంగ్రేస్ నాయకుడైన ఎన్కేపీ సాల్వా తన సలహాకు సానుకూలంగా స్పందించి 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగాడని తెలిపారు. ఆ మధ్య కాలం సాల్వా క్రికెట్ను ఎంతగానో అభివృద్ధి పరిచారనడానికి 1983లో భారత జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ గెలుచుకు రావడమే నిదర్శణమని అన్నారు. ఆ తర్వాత 1987లో భారత్-పాకిస్తాన్ దేశాలు సంయుక్తంగా ప్రపంచ కప్ నిర్వహించడంలో సాల్వా కృషి ఎంతగానో ఉందని అన్నారు. సాల్వా క్రికెట్ బోర్డుకే కాకుండా 2002వ సంవత్సరం వరకు రెండుసార్లు లోక్సభకు, నాలుగు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more