భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మూడో టెస్టులో 270 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 316 పరుగులకే కుప్పకూలింది. తరువాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ ఇండియా బౌలర్లను ఉతికి ఆరేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 73 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 216 పరుగులు చేసింది. ఇంగ్లండ్ను కెప్టెన్ కుక్ భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన కుక్ బాధ్యతాయుతంగా రాణిస్తున్నాడు. ఫలితంగా 236 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సర్తో 136 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అయితే మరో ఓపెనర్ కాంప్టన్ 137 బంతులాడి ఆరు ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగుల వద్ద ఓఝా బంతికి పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం కుక్ (136), ట్రాట్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎంతో రాణిస్తారని అనుకున్న ఫాస్ట్ బౌలర్లు నిరాశ పరిచారు. ఇదే పరిస్థితి రేపు కొనసాగితే... ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more