పూర్వం మహావిష్ణువు తన బావగారైన శివుడుని కలుసుకోవడానికి కైలాసానికి బయలుదేరుతాడు. (విష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్లు). మహావిష్ణువు అక్కడికి చేరుకున్న వెంటనే తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై వున్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి.. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని, మౌనంగా వుండిపోతాడు.
శివునితో మాటల్లో మునిగిపోయిన విష్ణువు ఈ ఉదంతాన్ని గమనించలేకపోతాడు. కొద్దిసేపు తరువాత సుదర్శన చక్రం ఎక్కడుందోనని గుర్తుకువచ్చి, విష్ణువు దానిని వెతకడం మొదలుపెడతాడు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి నీరసంగా వుండిపోతాడు. అది చూసిన గణపతి.. ‘‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’’ అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా విష్ణువు.. ‘‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో గుర్తుకు లేదు. ఎక్కడుందోనని వెదుకుతున్నా’’ అని చెబుతాడు.
అప్పుడు గణపతి.. ‘‘సుదర్శన చక్రమా..!? ఇంకెక్కడుంది..! నేను దానిని తినేశాగా’’ అని చెబుతాడు. గణపతి తనకు మేనల్లుడు అయిన కారణంతో విష్ణువు అతనికి ఏమీ చేయలేక.. చక్రం తిరిగి ఇవ్వమని బ్రతిమిలాడుతాడు. ‘‘సుదర్శన చక్రం దుష్టులకు సంహరించడానికి ఉపయోగించే ఆయుధం. దానిని ఎలాగైనా బయటికి తీయు’’ అని వేడుకుంటాడు. కానీ గణపతి, విష్ణువు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ వుండిపోయాడు.
అప్పుడు శ్రీమహావిష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్లు తీయడం మొదలుపెట్టాడు. విష్ణువు అలా చేస్తుండగా.. గణపతికి విచిత్రంగా అనిపించి, కడుపునొప్పేలా విపరీతంగా నవ్వాడు. అలా నవ్వడంతో గణపతి కడుపులో వున్న ఆ సుదర్శన చక్రం బయటపడుతుంది. విష్ణువు ఊపిరి పీల్చుకుని తన సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు.
ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు, గణపతి ముందు గుంజీళ్లు తీయడంతో అదొక ఆచారంగా మారిపోయింది. పురాతన కాలం నుంచి ప్రతిఒక్కరు గణపతి ముందు గుంజీళ్లు తీయడం ఒక సంప్రదాయం అయిపోయింది. శాస్త్రీయపరంగా ఒకసారి గమనిస్తే.. గుంజీళ్లు తీయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుంజీళ్లు తీయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి, మెదడుకు మేధస్సు శక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు.. దీనిని ‘‘సూపర్ బ్రెయిన్ యోగా’’ కూడా పరిగణిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more
Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more
Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more
Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more
Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more