కథ :
పూర్వం ఒకనాడు ఒక బ్రాహ్మణ దంపతులకు చాలాకాలం తర్వాత కూతురు పుడుతుంది. ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఆమెను ఎంతో గారాబంగా పెంచుతారు. అలా ఆమెకు యుక్తవయస్సు రాగానే వివాహం జరిపించారు. దురదృష్టవశాత్తూ ఆమకు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త చనిపోతాడు. భర్త చనిపోయాడన్న తీవ్ర మనస్తాపంతో ఆవేదన చెందుతున్న తమ కూతురిని చూసి.. ఆ తల్లిదండ్రులు చాలా దు:ఖానికి గురవుతారు.
ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతులు తమ కూతురి విషమగాథను ఒక మునికి వివరిస్తాడు. అప్పుడు ఆయన వారిద్దరి ఓదార్చి ఇలా అంటాడు.. ‘‘మీరు మీ కూతురితో కలిసి కాశీనగరానికి తీర్థయాత్రలకు వెళ్లండి. అక్కడ ఎంతో మహత్యమైన ఒక చెరువు వుంటుంది. కానీ ఆ చెరువు ప్రతిఒక్కరికి కనిపించదు. సాక్షాత్తూ పండు ముత్తైదువ రూపంలో వున్న గౌరీదేవి ఆధ్వర్యంలో స్త్రీలు పూజలు నిర్వహిస్తారు. ఆ చెరువు కనుక మీకూ కనిపిస్తే.. వెంటనే మీరు మీ కూతురితో కలిసి పూజలు చేయండి. ఒకవేళ మీకది కనిపించకపోయినా.. అక్కడికి వెళ్లినందుకు యాత్రాఫలం అయిన దక్కుతుంది కదా!’’ అని చెప్పి వెళ్లిపోతాడు.
ఆ ముని చెప్పిన మాటలను విని.. బ్రాహ్మణ దంపతులు తమ కూతురితో కలిసి కాశీనగర తీర్థయాత్రకు బయలుదేరుతారు. అక్కడికి వెళ్లిన తరువాత వారు చెరువును గాలించగా.. అది కనిపిస్తుంది. బ్రాహ్మణ దంపతులు ఆ చెరువు దగ్గరకు వెళ్లి అక్కడ పూజలు చేయిస్తున్న ముత్తైదువును కలుస్తారు. పూజకు సంబంధించిన విషయాల గురించి చెప్పమని వారు ఆమెను అడుగుతారు.
ఆ ముత్తైదువు ఆ దంపతుల కుమార్తె చరిత్ర గురించి తెలుసుకుని.. ఆమెతో చెరువులో స్నానం చేయిస్తుంది. అప్పుడు ముత్తైదువు ఆమెను చెరవులో నుంచి ఒక్కొక్కసారిగా దోసెడు ఇసుకును ఐదుసార్లుగా తీయమని చెబుతుంది.
ఆమె చెప్పిన మాటలు విని బ్రాహ్మణ కూతురు అలాగే చేయగా.. మొదటిసారి ఇసుక పసుపుగాను, రెండవసారి ఇసుక కుంకుమగాను, అలాగే మూడవసారి కొబ్బరిగా, నాలుగవసారి బెల్లంగా, ఐదవసారి జీలకర్రగా ఆ ఇసుక మారిపోతుంది. ఈ చమత్కారాన్ని చూసి ఆ బ్రాహ్మణులు ఆమె కూతురు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. తరువాత ముత్తైదువు వారికి మాఘ మంగళగౌరీ నోము గురించి వివరించి, ఉద్యపన చేయమని’’ సూచిస్తుంది.
బ్రాహ్మణ దంపతుల కుమార్తె.. ముత్తైదువు చెప్పిన విధంగా పాటించగా.. చనిపోయిన తన భర్త పునరుజ్జీవుడు అయి తిరిగి వస్తాడు.
విధానం :
మాఘమాసంలో అమావాస్య వెళ్లిపోయిన తరువాత వచ్చే పాడ్యమినాడు నుండి తిరిగి అమావాస్య ముగిసిన తరువాత వచ్చే పాడ్యమివరకు... అంటే మొత్తం 30 రోజుల వరకు ఈ నోమును చేయాలి. ఈ నోమును ప్రారంభించినవారు ఐదు సంవత్సరాలకు తూచాతప్పకుండా చేసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలను ముగించుకుని నదిలోస్నానం చేసుకోవాలి. అలాగే రేవులో పసుపుతో ఐదు పద్మాలు.. కుంకుమతో ఐదు పద్మాలు.. పిండితో ఐదు పద్మాలు పెట్టి... పసుపు రంగులో వున్న గౌరీదేవిని వుంచి పూజించుకోవాలి.
ఇలా ఈవిధంగా మొత్తం నెలరోజులవరకు పాటించాలి. నెలరోజులు కాగానే.. మొదటి సంవత్సరంలో 1250 గ్రాములు పసుపు, రెండవ సంవత్సరంలో కుంకుమ, మూడవ సంవత్సరంలో కొబ్బరి, నాలుగవ సంవత్సరంలో బెల్లం, ఐదవ సంవత్సరంలో జీలకర్ర ముత్తైదువులకు వాయనమివ్వాలి. తరువాత ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన :
మొదటగా ఐదుగురు ముత్తైదువులకు తలంటు స్నానాలు చేయించి వారికి భోజనాలు పెట్టాలి. తరువాత పైన చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి వాయనమివ్వాలి. చివరికి పసుపు గౌరీదేవిని నీళ్లలో నిమజ్జనం చేయాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more