పూర్వం ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా వుండేదో.. మనుషులు కూడా ఆ విధంగా స్వచ్ఛమైన మనసుతో, భక్తితో దేవుడ్ని ఆరాధిస్తూ సుఖంగా జీవించేవారు. ఎంతోమంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలోనే కాలం గడిపేవారు. అలాంటివారిలో కొందరి తపస్సుకు మెచ్చిన భగవంతుడు.. వారికి సాక్షాత్కరించి కోరికలు నెరవేర్చేవాడు. అలాగే.. వారి వారి కోరిక మీద ఏదో ఓ పవిత్రమైన ప్రదేశంలో వెలిసేవాడు. అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ప్రాచీనకాలం నుంచి అనేకరకాలుగా అభివృధ్ధిచెందాయి. కానీ.. కాలాంతరంలో ఆదరణ తగ్గి, చివరికి ఈ కాలంలో మరుగునపడిపోతున్నాయి. అలాంటి అపురూపమైన ప్రదేశాల్లో వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ఒకటి.
ఆలయ పురాణగాధ :
పూర్వం 1200, 1300 ఏళ్ల క్రితం ఈ పాలకుర్తి ప్రదేశంలో ఋషులు తపస్సు చేసేవారనీ, వారి తపస్సుకు మెచ్చి సోమేశ్వరుడు ప్రత్యక్ష్యమై వారి కోరికపై ఇక్కడే స్వయంభూగా వెలిశాడనీ చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం.. సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని అంటుంటారు. ఈ స్వామి కరుణకి ఇంకో నిదర్శనం కూడా వుంది. అదేమిటంటే..
పూర్వం.. అపరభక్తురాలైన ఓ వృధ్ధురాలు స్వామీకి ప్రదక్షిణ చెయ్యటానికి ఈ ప్రదేశానికి వచ్చేది. కానీ.. ఆలయం కొండపైన వుండటం కారణంగా ప్రదక్షిణ చేసేందుకు వీలుగా మార్గం లేకపోయింది. దీంతో ఆమె కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయస్సు మీద పడేకొద్ది ఆవిడ కొండ చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే.. పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి, ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పరించాడు. అప్పటినుంచీ స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. భక్తులు భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావయినవాళ్ళయినా సునాయాసంగా వెళ్తారనీ, అలాకాకుండా అపరిశుభ్రంగా వెళ్తే తేనెటీగలు కుట్టి, కుట్టి తరుముతాయనీ అక్కడివారి నమ్మకం. అక్కడ తేనెపట్లు చాలా వున్నాయి. ఆ తేనెటీగలు ఈ ప్రాంతానికి రక్షకభటుల్లా వుంటాయని నమ్ముతారు.
ఆలయం విశేషాలు :
కొండపైన వున్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు, సిరిసంపదలేకాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి. సోమేశ్వరస్వామిని దర్శించి, పూజలు చేసి, పక్కనే ఇంకొక గుహలో వున్న (బయటకు వస్తున్న మార్గంలోనే కనబడుతుంది) శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా సేవించవచ్చు. సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరిగాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారనీ, తరువాత తమ మొక్కు తీర్చకోవటానికి స్వామి దర్శనం చేసుకుని, తొట్టెలు కడతారనీ చెబుతారు. కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు, కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతాయి.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more