ఆశ్వయుజ అమావాస్యనాడు... అంటే దీపావళి ముగిసిన రెండురోజుల తరువాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘త్రిపుర పూర్ణిమ’గా లేదా ‘దేవ దీపావళి’గా వర్ణించుకుంటారు.
కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా ఒక విశిష్టమైన పర్వదినం. ఎందుకంటే.. గురునానక్ జయంతి కూడా ఈరోజే కాబట్టి. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవాలను కూడా నిర్వహిస్తారు.
కార్తీకమాసం మొదలైన రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం వేళ దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమవారాలను, పౌర్ణమి రోజును పవిత్రంగా భావించి, విశేష పూజలను నిర్వహించుకుంటారు. ఇలా నెలమొత్తం ప్రతిరోజు పూజలను నిర్వహిస్తూ కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేసుకుంటారు.
మహాభారతంలోని కథనం ప్రకారం... కార్తికేయుడు తారకాసురుడిని సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. అప్పట్లో తారకాసురుడు ప్రజలను అనేక రకాలుగా విసిగిస్తున్న నేపథ్యంలో కార్తికేయుడు అతనిని సంహరించాడు. దీంతో అప్పటి ప్రజలు ఆనందంతో దీపాలను వెలిగించి, సంబరాలను చేసుకున్నారు.
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రియమైన రోజు. ఈరోజున దీపాలను వెలిగించడంతో తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ విశిష్ట రోజున సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేయస్కరం.
ముఖ్యంగా కార్తీకపౌర్ణమినాడు ఉదయాన్నే లేవగానే.. సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం ఎంతో శుభప్రదమైంది. ఇకవేళ ఇలా స్నానం చేయడం కుదరకపోతే ఉదయాన్నే లేచి... స్నానాలు చేసిన తరువాత స్నాన జపాలు ముగించుకుని, ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు.
ఈ కార్యక్రమాలను ముగించుకున్న తరువాత రోజంతా ఉపవాసం వుండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి. ఈ వత్తులు మొత్తం రోజుకు ఒకటి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడంవల్ల ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే సకల పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలం దక్కుతుందని కూడా నమ్ముతారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని భక్తులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తారు.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more