పాదయాత్ర చెయ్యటానికి రాష్ట్ర బ్యాట్స్ మెన్ సిద్దమువుతున్నట్లు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. క్రికెట్ పై మంచి పట్టున్న ఆటగాడిగా పేరుతెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని ..సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే సీఎం కిరణ్ పాదయాత్ర చేసేది ఎవరి కోసం? ఎందుకోసం? అనే అనుమానం కాంగ్రెస్ నాయకులకే కలుగుతుంది. ఒకపక్క రాష్ట్రంలో పాదయాత్ర కాలం ముగిసిపోయి.. ఇప్పుడు బస్సుయాత్రలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. టిడిపిని అధికారంలోకి తేవటానికి నారా చంద్రబాబు నాయకుడు ఆత్మగౌరవ యాత్ర పేరుతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు.. సమైక్య శంఖారవం పేరుతో రాష్ట్రంలో బస్సుయాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరు గతంలో పాదయాత్ర చేసిన ఘనత ఉంది. అయితే ఈసారి పాదయాత్ర వంతు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీమాంధ్ర మంత్రులతో జరిగిన సమావేశంలో తాను పాదయాత్ర చేయాలని అనుకుంటున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి పాదయాత్రకు సీమాంద్ర మంత్రులు కొంతమంది సానుకూల వైఖరి చెప్పినట్లు తెలుస్తోంది. మరికొంతమంది అయితే.. సీఎం పై మండిపడినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడితే పార్టీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష సమరానికి దిగినట్లే అవుతుందనే విమర్శలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పాదయాత్ర వెనుక ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ నేతలు అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పై సీమాంద్ర సీఎంగా పేరు పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీఎం పాదయాత్ర చేపడితే.. తెలంగాణ నాయకుల నుండి సీఎంకు అధిక తీవ్రత ఉంటుందని.. కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. అయితే ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖభావంతో ఉన్నట్లు సమాచారం. ఇక ఉపముఖ్యమంత్రి అయితే.. సీఎం పాదయాత్ర మొదలుపెడితే... తెలంగాణలో సైకిల్ ర్యాలీ చేస్తానని ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సీనియర్ నాయకులతో చెప్పినట్లు గాంధీ భవన్ లోని కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కిరణ్ పాదయాత్ర చేస్తున్నారనే విషయం బయటకు రావటంతో.. షర్మిల, చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయి, విమర్శల దాడి చేయటం జరిగింది. అయితే వారు భయంతో చేశారో, లేక ఆనందంతో చేశారో తెలియాదు గానీ, మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియాజేశారని.. సీఎం వర్గీయులు ఆనందంగా ఉన్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more