మన రాష్ట్రంలో రాజకీయ నాయకులకు భలే ఢిమాండ్ ఉంది. గెలుపు గుర్రల కోసం రాజకీయ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి గెలుపు గుర్రాలకు తాయిలాలు ఎరగా వేసి, పార్టీలోకి తెచ్చుకుంటున్నారు. ఆ రాజకీయ నాయకుడు చరిత్ర ఎంత నీచంగా ఉన్నసరే, ఖద్దర్ బట్టలు ధరిస్తే చాలు.. ఆ నీచమైన మరకలు కనిపించావని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఒక మీద ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్న నాయకులే.. ఇప్పుడు చెట్టపట్టలేసుకోని ఒక జెండా కింద తిరుగుతున్నారు. ఒక పార్టీలో పనికిరాని నాయకులు.. మరో పార్టీలో సీనియర్ నాయకులు. ఈ పార్టీలో జీరోలు అయితే. మరో పార్టీలో హీరోలు. ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్.
అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు మంత్రులను ఔట్ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈ ఇద్దరి మంత్రుల పేర్లు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తో 45 నిమిషాల భేటి తరువాత తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిసింది. హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గతంలోనే రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాలను ఆదివారం ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కిరన్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరి పై వైఎస్ఆర్, టీఆర్ఎస్, బిజేపి నాయకులు కన్ను పడింది. కాంగ్రెస్ నాయకులు వీరిని పరమర్శిస్తుంటే.. మిగిలిన పార్టీ నాయకులు మాత్రం పరామర్శ పేరుతో .. రాజకీయ ఫిక్సింగ్ జరుపుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
సబితా ఇంద్రారెడ్డితో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కొండా దంపతులు మంతనాలు జరిపినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పై వైసీపీ నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. దర్మాన ప్రసాద్ రావు మాత్రం వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కానీ సబితా ఇంద్రా రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన సబితా ఇంద్రారెడ్డి చెబుతున్నారు, తనను కలిసిన వారితో ఆమె మాట్లాడుతూ తాము బిజినెస్ రూల్స్ ప్రకారమే పనిచేశామని, తన పై వచ్చిన కేసులో న్యాయపరంగా పోరాటం చేస్తానని ఆమె చెబుతున్నారు.
సందట్లో సడేమియలాగా .. టీఆఎస్ నాయకులు, బిజేపి కిషన్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కలిసి తమ పార్టీలోకి రావాల్సింగా కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుల సమాచారం మేరకు సబితా కాంగ్రెస్ పార్టీ వీడితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు గాంధీ భవనలో చెవులు కోరుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరికి పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ఆశలో పెట్టుకున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
వీరిని కాపాడటానికి ముఖ్యమంత్రి అధిష్టానం వద్ద ఎన్నో ప్రయాత్నలు చేసినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. కానీ చివరకు అధిష్టానం ప్రకటనకు తలవంచక తప్పలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే కొద్దిరోజుల్లో వీరి రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more