గాలి జనార్దన రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి 500 కోట్ల రూపాయలను బహుమతిగా ఇచ్చారట, దాన్ని ఆయన ఎన్నికలలో పార్టీని గెలిపించటానికి వాడుకున్నారట. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చులను కూడా గాలి భరించారట. ఈ మేరకు గాలి
జనార్దన రెడ్డి సిబిఐ కి వాంఙ్మూలమిచ్చారని కన్నడ పత్రికలు ప్రచురించాయని తెలుగు దేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, ఈ అవినీతిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని, ఎన్నికల సంఘం దీనిమీద చర్యలు తీసుకోవలసి వుంటుందని అన్నారు.
సంఖ్యల్లో ఎక్కువ తక్కువలుండవచ్చు కానీ గాలి జనార్దన రెడ్డి ద్వారా కోటానుకోట్ల రూపాయలు ఏరుల్లా పారాయన్నది మాత్రం నిజమని అప్పటి గాలి జీవన శైలి చూస్తే తెలుస్తుంది. సిబిఐ ఆకస్మిక తనిఖీలో బయట పడ్డ వస్తువులకే అందరూ విస్తుపోయారు. అలాంటిది, అంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతిలో తలా ఇంత పాపాన్ని కూడా పంచిపెట్టారన్నది కూడా సత్యమే. తిరుపతి వేంకటేశ్వరస్వామిని కూడా అందులో భాగం వహించమని కిరీటాన్ని బహూకరించిన గాలి జనార్దన రెడ్డి తన పనులను చేసుకోవటానికి విచ్చల విడిగా ఖర్చు పెట్టి వుంటారు, గొప్ప దాతగా పేరు గాంచివుంటారు. లేకపోతే కర్నాటక లో అంతమంది అభిమానులు గాలి విచారణ సమయంలో కోర్టుకి వచ్చుండేవారు కాదు.
అసలు విషయమేమిటంటే, జరుగుతున్న అవినీతి ఆ సమయంలో స్థానికంగా అందరికీ తెలుసు. ఉన్నట్టుండి ఒక కారు కొనుక్కుంటేనే స్థానికులు చెవులు కొరుక్కుంటారు. అలాంటిది రెండు హెలికాప్టర్లతో, ఇంట్లో అన్ని బంగారు వస్తువులతో లక్ష్మీ నిలయంలా గాలి గృహం విలసిల్లిందంటే దాని వెనక ఎంత మంది పనిచేసి వుంటారు, బంగారు వస్తువులతో సహా అన్ని పనులనూ ఆయనే స్వయంగా చేసుకోగలిగైతే ఉండరు కదా. కాలనీలో ఇల్లు కట్టాలన్నా, మార్పులు చెయ్యాలన్నా చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతరాలు తెలిజేస్తారు. మట్టి పడుతున్నదనో, లేక వాళ్ళ పునాదులు కదులుతున్నాయనో గొడవ చేసి కోర్టు కెళ్ళి స్టే తీసుకొస్తారు. అలాంటిది అక్రమంగా అంత నేలను తవ్వుతుంటే అధికారులంతా ఏం చేస్తున్నట్టు, మిగిలినవారి అభ్యంతరాల మీద చర్యలు ఎందుకు తీసుకోనట్టు. దీన్నిబట్టి చూస్తే అవినీతి సొమ్ము ఎంత మొత్తంలో పంపిణీ జరిగిందో తెలిసిపోతోంది.
అలా చెయ్యకుండా అధికారులు రంగం లోకి దూకి నిలువరిద్దామంటే పెద్ద తలకాయ వైయస్ గాలికి కాపు కాచివుండాలి. అందుకోసం ఏదో ఒక రూపంలో ఆయనకు డబ్బు ముట్టే వుండాలి. అవినీతి జరగలేదు అని ఎవరూ అనలేరు. జరిగింది, పెద్ద ఎత్తున జరిగింది, పై స్థాయిల్లో జరిగిందన్నది తేటతెల్లంగా ఉంది. వైయస్ మరణించివుండకపోతే అన్నీ మరుగునపడే వుండేవేమో. వైయస్ వలనే కాంగ్రెస్ నిలిచింది, కానీ వైయస్ వలనే అపఖ్యాతిని కూడా తలకెత్తుకోవలసి వస్తోంది. ఇలాంటి సంక్షోభం నుంచి కాంగ్రెస్ పార్టీ కాబట్టే బయట పడగలిగింది కానీ వేరెవరికీ సాధ్యమయ్యుండేది కాదు.
అసలు విషయాలన్నీ బయటపడుతుంటే ప్రజల దృష్టిని చాలా చాకచక్యంగా గాలి విలాసాల మీదకు మళ్ళించటం జరిగింది. సామాన్య ప్రజలకేముంది, ఫలానా మనిషి దగ్గర ఇంత డబ్బు, అంత బంగారం, అంతలేసి ఆస్తిపాస్తులు దొరికాయనగానే శాపనార్ధాలు పెట్టి వదిలేస్తారు. కానీ ఎవరినీ నిలదీయరు. ఇప్పుడు బయటపడింది, ఇంతకాలం మీరంతా ఏం చేస్తున్నారు. రాత్రికి రాత్రే జరిగిందైతే కాదు అంతా. మరి అధికారులు నిద్రపోతున్నారా. పాలకవర్గం కళ్ళు మూసుకుందా వారిని నియంత్రించే మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నాయి అని నిలదీసి అడిగేవారు లేరు.
అంతేకాదు, దొరికిన గాలి లాంటి వాళ్ళు దొరకకుండా ఇంకా ఎంతమంది ఏయే రూపాల్లో అవినీతికి పాల్పడుతున్నారో, ఎందరు అధికారులను తమ జేబుల్లో వేసుకుని పనులు కానిచ్చుకుంటున్నారో బయట పడేవరకూ తెలియదు. సిబిఐ విచారణలో కొందరు అధికారులైతే పట్టుబడ్డారు కానీ పూర్తి లెక్కలు తేలటం కష్టమే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more