ఫోన్ ట్యాపింగ్! ఇది కొత్త విషయమేమీ కాదు. ఎప్పటి నుంచో జరిగేదే! నిఘా వర్గాలను ఉపయోగించుకుని... పాలకులు చేసేదే! ఒకప్పుడు పరిమితంగా, అవసరాన్ని బట్టి మాత్రమే జరిగే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు శ్రుతి మించింది. విపక్షం, స్వపక్షం - అధికారులు, అనధికారులు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ట్యాపింగ్ జరుగుతోంది. మీడియాపైనా నిఘా మరింత పెరిగింది. ఎడిటర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు, సీఈవోలు, సీనియర్ జర్నలిస్టులు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే అంశాలు ఎప్పటికప్పుడు రికార్డు అయిపోతున్నాయి. తమ ప్రత్యర్థుల కాల్లిస్టు సంపాదించి, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నదీ తెలుసుకోవడం ఒక ఎత్తయితే... వారు ఏమేం మాట్లాడుతున్నారో రికార్డు చేసి మరీ వినడం ఈ దారుణానికి పరాకాష్ఠ. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే.పార్టీల మధ్య విభేదాలు ఒక ఎత్తయితే, అధికార పార్టీలోనే కుమ్ములాటలు మరో ఎత్తు. ఎవరు కోవర్టులో, ఎవరు నమ్మకస్తులో తెలియని పరిస్థితి. దీంతో ఎవరేం చేస్తున్నారో తెలుసుకునేందుకు 'ట్యాపింగ్'ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. దీని బారి నుంచి తప్పించుకునేందుకు ఓ ప్రముఖుడు ఆరు సిమ్కార్డులు వాడుతున్నారు. సాధారణ విషయాలు మాట్లాడేందుకు... అందరికీ తెలిసిన నెంబర్ను ఉపయోగిస్తారు. ముఖ్యమైన విషయాలను మాట్లాడటానికి వేర్వేరు సిమ్కార్డులను వాడుతున్నారు.
ట్యాపింగ్ దెబ్బకు ఇలా పెద్దలే వణికిపోతున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సంగతి సరేసరి! ఈ మధ్య టీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ కావడం మొదలైనట్లు సమాచారం.ట్యాపింగ్ కింగ్లు మీడియా యజమానులు, సీనియర్ విలేకరులపై ప్రత్యేక నిఘా వేశారు. అన్ని పార్టీల నేతలతో మాట్లాడే మీడియా ప్రతినిధులపై కన్నేస్తే... అందరి గుట్టు తెలుసుకోవచ్చుననేది వీరి ఉద్దేశం. ఇటీవల ఓ టీవీ చానల్ అధిపతి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి గులాం నబీ ఆజాద్తో మాట్లాడారు.ఆ మాటలన్నీ రికార్డు అయ్యాయి. మరో టీవీ చానెల్ సీఈవో సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్తో మాట్లాడిన మాటలన్నీ 'దొంగ చెవులు' వినేశాయి. అంటే... ట్యాపింగ్ ద్వారా అధిష్ఠానం గుట్టు కూడా తెలుసుకోగలుగుతున్నారన్న మాట. ఈ ట్యాపింగ్ పోలీసు అధికారులను కూడా భయపెడుతోంది.సీనియర్ అధికారుల మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో... చాలా మంది ఐపీఎస్ల ఫోన్లన్నీ ట్యాప్ పరిధిలోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో... అధికారులు తమ ఫోన్లను అధికారిక పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ట్యాపింగ్ తర్వాత కొన్ని సందర్భాల్లో బ్లాక్ మెయిలింగ్కు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.ఇది రోజుకు గంటో, రెండు గంటలో జరిగే వ్యవహారం కాదు. 24గంటలూ సాగే రికార్డింగ్! దీంతో ట్యాపింగ్ లిస్టులో ఉన్న వారు కుటుంబసభ్యులతో మాట్లాడే విషయాలూ 'దొంగ చెవుల్లో' పడిపోతున్నాయి. ప్రైవసీ కరువై వీరంతా విలవిల్లాడిపోతున్నారు.దొంగలు, నేరగాళ్ల కదలికలను తెలుసుకునేందుకు ఉపయోగించే ట్యాపింగ్ను తమపై ప్రయోగించడమేంటని వీవీవీఐపీలు వాపోతున్నారు. 'కొందరి అపనమ్మకం, ఉలికిపాటు అందరికీ చేటు తెస్తోంది' అని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more