ఐఏఎస్ లలో వేడి రాజుకుంది. వారి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఇంతకాలం ఎదురులేని వారిని నిలదీసేవారు వచ్చేసరికి జీర్ణించుకోవటం కష్టంగా ఉంది. నిలదీసేవారు లేరని కాదు. కానీ వారు ప్రభుత్వం నడిపించే ప్రజాప్రతినిధులు. వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నామని ఉన్నా, వారి అధికారం ముందు తలవంచ వలసి వస్తున్నందుకు ఎప్పుడో అలవాటు పడటం వలన అదేమీ కొత్త అనిపించటం లేదు. కానీ సాటి అధికారి ఒక దర్యాప్తు సంస్థను నడిపిస్తున్నంత మాత్రాన తమని నిలదీయటం ఐఏఎస్ అసోసియేషన్ అత్యవసర సమావేశమవటం, అందులో తమ ఆవేశాలను వెళ్ళగక్కుకోవటం, ముఖ్యమంత్రితో భేటీ అవటమే కాకుండా, వేలకొద్దీ కుంభకోణం జరిగినప్పుడు అదంతా మేమే తిన్నామంటారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మంత్రులు వత్తిడి వలన సంతకాలు పెట్టామని ముందు చెప్పినవారు, మంత్రలు వందల కోట్లు తింటే మేమూ కోట్లలో తిన్నాం. వాళ్ళని వదిలేస్తారా అని అడిగే పరిస్థితికి వచ్చారంటే సిబిఐ తన దర్యాప్తులో సాధించదలచుకున్నది సాధిస్తున్నట్టే.
మంత్రులను ప్రశ్నించరేం అని అడుగుతున్నారు కానీ వారిని ముట్టుకోకుండానే అంతా బయటపడేట్టు చేస్తోంది సిబిఐ. అది ఇంకా గొప్పతనం. సిబిఐ తలనొప్పిగా కాదు గుండెనొప్పిగా మారినప్పుడే కదా అసలు విషయాలన్నీ బయటపడేది. అదే జరుగుతోంది. ఈ వత్తిడిని భరించలేక కీలకమైన మంత్రుల పేర్లను బయటపెట్టటానికి సిద్ధమైన పక్షంలో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే పరిస్థితి వస్తే దర్యాప్తు నీరు కారటమంటూ జరిగితే ప్రభత్వం చాలా చెడ్డపేరు మొయ్యాల్సివస్తుంది. అందువలన దర్యాప్తు కొనసాగుతుంది, కానీ ఎవరికీ ఏమీ కాదన్న సంకేతాన్ని కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. ఏం పరవాలేదు జైలుకే కదా వెళ్ళేది, బెయిలు తీసుకోండి అని తేలిగ్గా చెప్పేసారు. కానీ వీళ్ళకే ఆ సంకేతం సరిగ్గా అందనట్టుంది.
ఏమైనా సిబిఐని మెచ్చుకోవలసిందే. ఎక్కడ వాత పెట్టాలో తెలుసుకుని పెట్టినట్టుగానే కనిపిస్తోంది. ఒకసారి ఇలా జరిగితే అధికారులు తమ మీదకు కూడా వస్తుందనే భయం కలిగితే కొంతైనా అక్రమాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అవినీతి గుర్తించినప్పుడు ఉపేక్షించేది లేదు మంత్రులైనా లేదా అధికారులైనా సరే అన్న సంకేతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వీటన్నిటినీ ఎన్నికల సమయంలో తమ పక్షంలో ఏకరువు పెట్టటానికి కూడా ప్రభుత్వానికి పనికి వచ్చే విధంగానే సంఘటనలన్నీ చోటుచేసుకుంటున్నాయి విచిత్రంగా. మరో విషయాన్ని ఐఏఎస్ లు విస్మరిస్తున్నారు. రాజకీయనాయకుల ఒత్తిడి వలన తాము ఎడాపెడా ఏమీ చూసుకోకుండా సంతకాలు పెట్టామంటున్నారు కదా, ఇప్పుడు ఆ సంబంధిత మంత్రులను సిబిఐ విచారించటంలేదేమని ఎందుకు అడుగుతున్నారు. దర్యాప్తు సంస్థలోని అధికారులు కూడా అలాగే చేస్తున్నారని ఎందుకనుకోరు? రాజకీయ నాయకులకు భయపడే హక్కు వాళ్ళకే ఉందా?
తక్కువో ఎక్కువో తరువాత సంగతి కానీ, మేము తిన్నాం, మా చేత సంతకాలు చేయించినవారూ తిన్నారు అని అరెస్ట్ చేసినవారి నోటనే కాకుండా మొత్తం ఐఏఎస్ అధికారులందరి చేత చెప్పించన ఘనత సిబిఐదే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more