mm keravani released a video on multiple sclerosis disease లెజెండరీ మ్యూజీషియన్ ఎంఎం కీరవాణికి అసలేమైందీ.?

Mm keravani released a video on multiple sclerosis disease

Legendary Musician Multiple sclerosis, Music Director Multiple sclerosis, MM Keeravani Multiple sclerosis, Multiple sclerosis, Vidya Balan Multiple sclerosis, Social Media Multiple sclerosis, Twitter Multiple sclerosis, MM keeravani Multiple sclerosis, mm keeravani twitter, Viral Video, Tollywood

Music Legend MM Keeravani latest video posted on twitter today is shaking the tollywood music lovers. The Legendary musician says that he is suffering with Multiple sclerosis in a video post which is released today through this twitter account.

లెజెండరీ మ్యూజీషియన్ ఎంఎం కీరవాణికి అసలేమైందీ.? ఎంఎస్ అంటే.?

Posted: 09/23/2020 02:22 AM IST
Mm keravani released a video on multiple sclerosis disease

టాలీవుడ్‌ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.‌ఎం‌. కీరవాణికి అసలేమైందీ.? ఈ ప్రశ్న టాలీవుడ్ ప్రేక్షకులనే కాదు మంచి సుస్వరాల సంగీతాన్ని అస్వాధించే వారందరినీ తొలుస్తోంది. ఆయన ఇవాళ ఉదయం పోస్టు చేసిన వీడియోను చూసిన వారెవరికైనా అసలేమైందీ.? ప్రమాదం ఏమీ లేదు కదా.? ఇలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఆయన అభిమానులకైతే ఆయన అరోగ్యం పట్ల తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇటీవలే కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన దాని నుంచి కోలుకుని రెండు పర్యాయాలు ప్లాస్మా దానం చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇంతలో మరో అరుదైన వ్యాధి అయను బాధిస్తోందన్న విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు.

ఇంతకీ ఆ అరుదైన వ్యాధి ఏంటీ..? దాని బారినపడితే పెద్ద ప్రమాదమేమీ లేదు కదా.? అంటూ తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నెట్టింట్లోనూ విపరీతంగా ఈ వ్యాధి గురించి సర్చ్ చేస్తున్నారు. ఆ వ్యాదే ‘మల్టిపుల్‌ స్కెలెరోసిస్’ (ఎం.ఎస్). ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్నానని వివరిస్తూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని కీరవాణి పేర్కోన్నాడు. ఇది కేవలం ఒక్క నిర్ధిష్ట వయసు వాళ్లకే వస్తుందని లేదని.. ఎప్పుడు ఏ వయసు వాళ్లకైనా ఎప్పుడైనా రావచ్చని చెప్పాడు.

ఈ వ్యాధిపై ‘ఎంఎస్‌ ఇండియా’ సోసైటీ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వానికి తన గళాన్ని వినిపిస్తుందని వీడియోలో కీరవాణి తెలిపాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం‌ వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చని చెప్పారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఇక కీరవాణి ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కాగా తమ అభిమాన సంగీత విధ్వాంసుడికే ఇలా జరగడంతో ఆయన ఫ్యాన్స్ అవేదన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles