టాలీవుడ్ కు సంబంధించిన వ్యవహారాల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎంత క్రియాశీలకంగా ఉంటారో తెలియంది కాదు. అయితే సామాజిక సేవల విషయంలో మాత్రం ఆయన అంతే గోప్యత ప్రదర్శిస్తారు. తాజాగా ఆయన చేస్తున్న ఓ మంచి పని వెలుగులోకి వచ్చింది.
కొన్నేళ్ల క్రితం ఏఎస్ బీపీ స్కూల్ కమిటీ తరపున నిర్వహించిన గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంలో పాఠశాలల అభివృద్ధి కోసం 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు ఇకపై ప్రతీ ఏడాది అలాగే సాయం చేస్తానని ప్రకటించారు కూడా.
అన్న మాట ప్రకారం అలాగే సాయం చేస్తూ వస్తున్నారు కూడా. ఈ ఏడాది ఫీల్ ఖానా పరిధిలోని కన్య విద్యా సమితి వారికి 25 వేల రూపాయల చెక్కును అందజేయగా.. ఆయనకు కృతజ్నతలు తెలియజేస్తూ సదరు సమితి వాళ్లు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇన్నాళ్లుగా అల్లు అరవింద్ చేస్తున్న ఈ గుప్త సాయంపై ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రత్యేక ప్రశంసలు కురుస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more