సరిగ్గా బాహుబలి-2 ప్రీరిలీజ్ కు ముందు టాలీవుడ్ లో సంగీత దర్శకుడు కీరవాణి చేసిన ట్వీట్లు పెద్ద కలకలమే రేపాయి. రాజమౌళిని పొగిడే క్రమంలో కొందరు దర్శకులు, రచయితలపై తీవ్ర పదజాలమే వాడాడు ఆయన. ముఖ్యంగా వేటూరి, సిరివెన్నెల లాంటి వాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత తెలుగు సినీ సాహిత్యం చనిపోయిందంటూ ఆయన చెప్పటం తీవ్ర విమర్శలకు దారితీసింది. జక్కన్న పొగిడితే పొగిడాడు కానీ, మమల్నేందుకు టార్గెట్ చేయటం అంటూ బహిరంగంగానే వాళ్లు కామెంట్లు చేశారు.
ఇక కొందరు గేయ రచయితలు కీరవాణిపై మండిపడ్డారు కూడా. ఆయన చేసిన కామెంట్లు అస్సలు మంచివి కావని కొందరు అభిప్రాయపడగా, ఓ యవ రచయిత మాత్రం వ్యంగ్యాస్త్రాలు పేల్చాడు. బాత్ టబ్ లో షవర్ కింద కూర్చుని కీరవాణి రాసిన పాటల కంటే తామెంతో మెరుగ్గా రాస్తామని అతను అంటున్నాడు. అంతేకాదు శంకరాభరణం స్థాయిలో పాటలు రాయకపోయినప్పటికీ, తాము రాసిన పాటలు కూడా అర్థవంతంగానే ఉంటాయని తెలిపాడు.
మరో రచయిత రామజోగయ్య శాస్త్రి కాస్త సున్నితంగానే తన ఒపీనియన్ చెప్పాడు. త్రివిక్రమ్, కొరటాల లాంటి దర్శకులు మంచి సీన్లు ఇవ్వగలరు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన పాటలనే తాము రాస్తున్నాం కదా. నేనేం ఆయన్ను తప్పుపట్టడం లేదు. కానీ, చంద్రబోస్, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, శ్రీమణి, మేమంతా మంచి రచయితలమే కదా అని చెప్పుకొచ్చాడు. దర్శకులు ఒత్తిడి తెస్తేనే మంచి మంచి పాటలు ఇంకా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపాడు.
ఇక ఇంకో రచయిత మాత్రం భీభత్సమైన సెటైరిక్ వ్యాఖ్యలు చేశాడు. నా దృష్టిలో వేటూరి, సీతారామశాస్త్రి తర్వాత కీరవాణే గొప్ప సంగీత దర్శకుడు. తెలుగు సాహిత్య రక్షకుడు ఆయన. కానీ, దురదృష్టవశాత్తూ ఆయన మాత్రం రాజమౌళి కోసమే తన కలాన్ని వాడుతున్నాడు. తెలుగు గేయాన్ని ఆస్కార్ దాకా తీసుకెళ్లగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఆయన అంటూ చమత్కరించాడు. మొత్తానికి కీరవాణి రేపిన దుమారం టాలీవుడ్ లో పెద్ద రచ్చ రచ్చే చేసి పడేస్తోంది. దీనిపై దర్శకుల వర్షన్ ఇంకా రాలేదు మరి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more