ఆర్థిక అవాంతరాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాలపై కూడా పెను ప్రభావం చూపుతున్నాయి. చేసుకున్న ఒప్పందాలను బ్రేక్ చేయటం, వారిపై ఫిర్యాదుల దాకా వెళ్లిపోవటం ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఊపిరి సినిమా సమయంలో శృతీహాసన్ వ్యవహారం గుర్తుండే ఉంటుంది. డేట్లు అడ్జస్ట్ కాకపోవటంతో తప్పుకోవటం, అడ్వాన్స్ విషయంలో వివాదం రేగటంతో నిర్మాతల మండలి దాకా వెళ్లింది. చివరకు పరిస్థితి సద్దుమణగటం, తమన్నా రీప్లేస్ కావటం తెలిసిందే. నాన్నకు ప్రేమతో సమయంలో కూడా బీఎస్ వీఎన్ ప్రసాద్, పవన్ కళ్యాణ్ మధ్య కూడా అత్తారింటికి దారేది అడ్వాన్స్ గురించి ఇలాంటి సీనే జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి మరో వివాదం రేగింది.
మహేష్ 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్టును తామే నిర్మిస్తామంటూ పీవీపీ బ్యానర్ ప్రకటించటమే కాదు, మహేష్ బర్త్ డే కి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే బ్రహ్మోత్సవం దెబ్బ నుంచి బయటపడేయించేందుకే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయిన మహేష్ రిస్క్ ఎందుకని వాళ్ల నష్టాన్ని పూడ్చటంతో ప్రాజెక్టులోకి దిల్ రాజు, సీనియర్ ప్రోడ్యూసర్ అశ్వనీదత్ లు ఎంటర్ అయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల ముందే అఫీషియల్ గా కూడా చెప్పేసుకున్నాం.
అయితే పీవీపీ చేసిన నిర్వాకంతో దర్శకుడు వంశీ పైడిపల్లి చిక్కుల్లో పడ్డాడు. 'పీవీపీ సినిమా' అధినేత ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు. ఊపిరి సమయంలో తనతో వంశీ రెండు సినిమాల కోసం అగ్రిమెంట్ చేసుకున్నాడంట. దానిని బ్రేక్ చేస్తూ ఇప్పుడు వేరే నిర్మాతలతో సినిమా చేయటంపై పీవీపీ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. డీల్ ను కాదని, ప్రస్తుతం వంశీ మరోకరితో సినిమా చేస్తున్నాడని ప్రసాద్ అందులో ఆరోపించాడు. కాగా, ఫిర్యాదు వార్తను నిర్మాత మండలి ధృవీకరించింది. మరి ఈ విషయంలో మహేష్ ఇన్ వాల్వ్ అవుతాడా?, దిల్ రాజు ఏం చేయబోతున్నాడు? అసలు సినిమా పరిస్థితి ఏంటన్నది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more