ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత... సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ చేయాలోనని సినీదర్శకనిర్మాతలు తెగ కంగారుపడిపోతున్నారు. ఇటు హైదరాబాద్ లో చేస్తే ఆంధ్రప్రదేశ్ జనాలు కాస్త ఫీల్ అవుతారని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ వంటి ప్రాంతాల్లో చేస్తే హైదరాబాద్ జనాలు ఫీల్ అవుతారనే అయోమయంలో వున్నారు. కానీ ఇటు హైదరబాద్ లో, అటు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, వైజాగ్ వంటి ప్రాంతాలలో సినీ కార్యక్రమాలు జరుపుతున్నారు.
ఇక హైదరాబాద్ లో పలు స్టూడియోలు వున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ, రామానాయుడు స్టూడియోస్, సారధి స్టూడియోస్.. ఇలా పలు స్టూడియోలు వున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో అంతగా స్టూడియోలు లేవు. కానీ కొంతమంది అగ్ర, స్టార్ హీరోలు ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోలు కట్టాలనే ఆలోచనలో వున్నట్లుగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు.
అల్లు అర్జున్ నటిస్తున్న ‘సరైనోడు’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 10న వైజాగ్ లోని ఆర్.కె.బీచ్ లో గ్రాండ్ గా చేయనున్నారు. ఈ విషయాలను తెలియజేయడానికి చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము ఎప్పటినుండో ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా షూటింగ్ లు జరగాలని, ఇక్కడ కూడా పరిశ్రమ స్థిరపడాలని కోరుకుంటున్నాము. ఇప్పటికిప్పుడే అది కుదరకపోయినా పెద్ద చిత్రాల షూటింగ్స్, ఈవెంట్స్ ఇక్కడ జరిగాలని కోరుకున్నాము. దీని కోసం చిరంజీవి గారిని ఇతర హీరోల్ని కూడా సంప్రదించటం జరిగింది. హీరోల కో-ఆపరేషన్ లేకుంటే అది సాధ్యపడదు. అల్లు అర్జున్ సరైనోడు ఫంక్షన్ ఇంత భారీగా చేస్తున్నందుకు చాలా దన్యవాదాలు. తనకి వైజాగ్ అంటే చాలా ఇష్టమని ఇక్కడ స్టూడియో కట్టాలనుకుంటున్నాను అని చెప్పారు. అలాగే రామ్ చరణ్ , నందమూరి బాలకృష్ణ కూడా స్టూడియో కట్టాలనే ఆలోచన వున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో జరిగినట్టు ఐఫా అవార్డు ఫంక్షన్ లు ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాము. సినిమా ఫంక్షన్స్ , షూటింగ్స్ కి పర్మిషన్స్ సింగిల్ విండో పద్దతిలో ఇచ్చేస్తామని. సినిమా ఇండస్ట్రికి ఎటువంటి సహయాన్నైనా అందిస్తాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మెగా హీరోలందరికి, అభిమానులకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అని అన్నారు.
మరి గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రాంచరణ్, బాలకృష్ణలు ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోలు కట్టాలనే ఆలోచనలో వున్నారా లేదా అనే విషయం భవిష్యత్తులోనే తెలియనుంది. మరి సినీఇండస్ట్రీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు, సహకారాలు అందజేయనుందో ముందు ముందు చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more