దర్శకనిర్మాత గుణశేఖర్ భారీ వ్యయంతో నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలకు ఆదినుంచే ఆటంకాలు ఏర్పడుతూనే వున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని ఏడాది అయినప్పటికీ.. ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. అప్పుడెప్పుడో ఈ ఏడాది తొలినాళ్లలో అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించాడు కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆమధ్య వేసవి సెలవుల్లో రిలీజ్ వుంటుందని వార్తలొచ్చినా.. సరైనా ఔట్ పుట్ కోసం గ్రాఫిక్స్ సమకూరుతున్నారని, అందుకు విడుదల తేదీని అనౌన్స్ చేయడం కష్టమని యూనిట్ చెప్పింది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ చేయడం ఖాయమని మొన్నీమధ్యే దర్శకుడు ప్రకటించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి, అనుష్కతో చెప్పించడమే కాకుండా తానూ బలంగా చెప్పాడు. దీంతో ఈ చిత్రం విడుదలకు కష్టాలు తొలగిపోయాయని అంతా భావించారు. కానీ.. ఈ చిత్రం మళ్లీ వాయిదా పడిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
యూనిట్ వెల్లడించిన విడుదల తేదీ దగ్గర పడుతూ వుండగానే.. ఈసారి కూడా చెప్పిన తేదీని సినిమా రిలీజ్ కావడం కష్టమేనని ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి.. ఈ చిత్రం సెన్సార్ రిప్టోరు కూడా అయిపోయింది. 2 గంటల 38 నిముషాల నిడివిగల ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ అయ్యింది. దీంతో ఈ చిత్రం విడుదల ఖచ్చితంగా వుంటుందని భావించారు కానీ.. ఈసారి కూడా వాయిదా పడనుందని అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా చివరి దశకు చేరుకోకపోవడం వల్లే ఈ చిత్రం రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరికొందరు ఆర్థికపరమైన కారణాల వల్ల ఈ చిత్రం విడుదల ఆలస్యం కావచ్చునని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఈ సినిమా విడుదలపై మరోసారి పుకార్లు రావడంతో.. ఇతర చిత్రాల దర్శకనిర్మాతలు ఆందోళనల్లో మునిగిపోయారట. ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలను బట్టి తమ సినిమాలని రిలీజ్ చేయాలని కొందరు ప్లాన్ చేసుకున్నారు. కానీ.. ఈ సారి కూడా చిత్రం వాయిదా పడుతుండడంతో వారు అయోమయంలో పడిపోయారని తెలుస్తోంది. అటు.. అనుష్క కూడా ఈ సినిమా విడుదల జాప్యం వల్ల అసహనానికి గురవుతోందని వినిపిస్తోంది.
ఈ విధంగా ఈ సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడిందంటూ ప్రచారం జోరుగా జరుగుతుంటే.. మరోవైపు దర్శకుడు గుణశేఖర్ సినిమాను అనుకున్న విధంగానే అక్టోబర్ 9న విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఏదేమైనా.. ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే.. దర్శకుడు గుణశేఖర్ పెదవి విప్పాల్సిందే! అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ సినిమా.. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే విజువల్ ఫీస్ట్గా నిలవనుందని తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more