ఇటీవలే సెక్సీనటి శృతి హాసన్, పివిపి వారి పిక్చర్ హౌస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్య ఓ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే! ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషాచిత్రాలతో ఫుల్ బిజీగా వున్నప్పటికీ.. ఆ సంస్థ నిర్మించే ‘నాగార్జున-కార్తీ’ మల్టీస్టారర్ నటిస్తానంటూ ముందు ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె పాత్రమేరకు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసింది. అయితే.. ఇప్పటికే తన చేతిలో ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు వున్న నేపథ్యంలో ఈ మూవీకి డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. దీంతో ఏం చేయాలో తోచక అమ్మడు ఆ మూవీ నుంచి సడెన్ గా డ్రాప్ అయింది!
అంతే.. ఈ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్న సంస్థ ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసింది. అటు నుంచి ఆమె కూడా ఈ కేసుకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తూ వచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య కొన్నాళ్లపాటు బాగానే వాగ్వాదం జరిగింది. అయితే.. ఇంతలోనే పివిపి నిర్మాణ సంస్థ కేసు విత్ డ్రా చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తమిళ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఇద్దరూ కలిసి ఈ విషయాన్ని డీల్ చేసారు. అయితే.. ఈ సినిమాలోని ఈమె పాత్రకోసం చేసిన ఖర్చును తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ పివిపివారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సినిమాకోసం శృతి హాసన్ కి 10 లక్షల అడ్వాన్స్ తో పాటు, తన కాస్ట్యూమ్స్ కి 8 లక్షలు ఖర్చు చేసినట్లు పివిపివారు తెలిపారు. ఆ మొత్తాన్ని తిరిగి కట్టాలని వారు డిమాండ్ చేయగా.. అమ్మడు ఆ డబ్బులకు బదులుగా వారికి ఓ బంపరాఫర్ ఇచ్చింది. ఆ డబ్బుకు బదులుగా ఫ్రీగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తానని తెలిపింది. అందుకోసం వారు అడిగిన 4 రోజుల డేట్స్ కూడా ఇచ్చింది.
నిజానికి ‘సైజ్ జీరో’లో శృతి ఓ కీ రోల్, ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు అప్పట్లో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది కూడా. అయితే.. ఇప్పుడు ఆ రెండింటిని ఈ అమ్మడు ఫ్రీగా చేయనుంది. ఒకవేళ మళ్ళీ చివర్లో శృతి ఆ సాంగ్ చేయకపోతే తమ డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని పివిపివారు ముందే సూచించారట!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more