కమలహాసన్ ముద్దుల తనయ, కథానాయిక శృతి హాసన్ కి ఓ పత్రిక మీద చిర్రెత్తుకొచ్చింది. దాంతో సదరు పత్రికకి లీగల్ నోటీస్ పంపించింది. తనకీ, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కీ మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందంటూ ఓ కథనాన్ని ప్రచురించిన ఓ తమిళ వారపత్రికకు శృతి హాసన్ తాజాగా లీగల్ నోటీస్ ఇచ్చింది. ఎటువంటి ఆధారాలు లేని అవాస్తవాలతో కూడిన ఆ కథనం, తమ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా వుందని ఆమె భావిస్తోంది. అందుకే, సదరు పత్రికలో ఈ విషయంపై క్షమాపణతో కూడిన వివరణ ఇవ్వాలనీ, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటాననీ ఆమె నోటీసులో హెచ్చరించింది. ఇదిలా ఉంచితే, ఇంతవరకు ఒక్క హిట్టంటూ లేని శృతి హాసన్, ఫిబ్రవరి 3 న విడుదలవుతున్న తమిళ చిత్రం '3' మీదే ఆశలు పెట్టుకుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more