రాష్ట్ర ఐటీ పరిశ్రమ మొట్టమొదటిసారిగా ఈ ఏడాది రూ. 50,000 కోట్ల టర్నోవరు మార్కు దాటిందని, రూ. 53,246 కోట్లకు చేరిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ సంస్థల సమాఖ్య ఇట్స్ఏపీ ప్రెసిడెంట్ వి. రాజన్న తెలిపారు. ఇందులో ఎగుమతుల వాటా 76 శాతం (రూ. 40,646 కోట్లు) కాగా, దేశీయ మార్కెట్ వాటా 24 శాతం (రూ. 12,600 కోట్లు) అని ఆయన వివరించారు. ఉపాధి పరంగా కూడా రాష్ట్ర ఐటీ పరిశ్రమ మరో మైలురాయి అధిగమించినట్లు రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష ఉపాధికి సంబంధించి తొలిసారి 3,00,000 ఉద్యోగాల మార్కు దాటిందని వివరించారు.ప్రస్తుతం మొత్తం 13.3 లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా ..ఇందులో 3,18,624 మంది ప్రత్యక్షంగాను, 10,12,769 మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని రాజన్న పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో 38 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఐటీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రానిది దేశంలో నాలుగో స్థానమని పేర్కొన్నారు. జాతీయ సగటుకు సమానంగా రాష్ట్ర ఐటీ 16 శాతం వృద్ధి రేటు సాధిస్తోందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more