Sammakka saralamma jatara

Sammakka Saralamma Jatara or Medaram Jatara is a tribal festival of honouring the goddesses celebrated in the Telangana region of Andhra Pradesh, India.The Jatra begins at Medaram in Tadvai Mandal in Warangal district. It commemorates the fight of a mother and daughter, Sammakka and Saralamma, with the reigning rulers against an unjust law. It is believed[who?] that after Kumbha Mela, the Medaram jatara attracts the largest number of devotees in the country. Medaram Jatara would be held between February 8-10 in 2012, in warangal District andhra Pradesh On Feb 8, Saralamma would be brought from Kannepalli village to the jatara venue. The next day, Sammakka.

Sammakka Saralamma Jatara or Medaram Jatara is a tribal festival of honouring the goddesses celebrated in the Telangana region of Andhra Pradesh, India.The Jatra begins at Medaram in Tadvai Mandal in Warangal district. It commemorates the fight of a mother and daughter, Sammakka and Saralamma, with the reigning rulers against an unjust law. It is believed[who?] that after Kumbha Mela, the Medaram jatara attracts the largest number of devotees in the country. Medaram Jatara would be held between February 8-10 in 2012, in warangal District andhra Pradesh On Feb 8, Saralamma would be brought from Kannepalli village to the jatara venue. The next day, Sammakka.

Sammakka Saralamma Jatara.GIF

Posted: 02/06/2012 05:39 PM IST
Sammakka saralamma jatara

Sammakka_Saralamma_Jatara

Medaram_Jatara

కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు సమ్మక్క – సారలమ్మ.. ఆ చల్లని తల్లుల గద్దె మీద కొలువై, భక్తుల మెరలాలకించే అపురూప ఉత్సవం మేడారం జాతర.

కొందరు దేవుళ్లు.. ఆకాశం నుండి ఊడిపడరు. మట్టిలోంచి ఉద్భవిస్తారు. మేఘాల్లో విహరించు... మనుషుల మధ్యే నడయాడతారు. అమరత్వాన్ని ఇష్టపడరు. జనం కోసం ప్రాణాలర్పిస్తారు. అందుకు సమ్మక్క సారలమ్మ లే సాక్షి.
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు ఏటూరు నాగారం అభయారణ్యం.. నిర్భయ జనారణ్యంగా మారుతంది.  మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా... ఒక రాష్ట్రమేమిటి.... ఒక ప్రాంతమేమిటి... ఎక్కడెక్కడి నుంచో భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తారు. అది తెలంగాణ కుంభమేళా గిరిజనుల మహోత్సవం. జనం కోసం మరణించిన వారిని... ఆ జనమే బతికుంచుకుంటారనడానికి మేడారం జాతరే మేలిమి ఉదాహారణ. ప్రతి రెండేళ్ళకోసారి నాలుగు రోజులు జరిగే ఈ జాతరను చూడటానికి రెండు కళ్ళు చాలవు.

మేడారం స్థల పురాణం :Sammakka_Sarakka
పదమూడో శతాబ్దంలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడి ప్రతాపానికి ఎదురొడ్డి నిలిచిన గిరిజన వనితలు. సమ్మక్క – సారలమ్మ. ఆ మగువల తెగువను మనసారా తలుచుకోవడానికే, ఆ తల్లుల త్యాగానిరతికి తలవంచి ప్రమాణాలు చేయడానికే... ఈ జాతర.
మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్దరాజు పాలించేవాడు. ఆయన సతీమణి సమ్మక్క, ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న... ముగ్గురు సంతానం. ఎనగందుల (ప్రస్తుత కరీంనగర్ జిల్లా)ను పాలించిన మేడరాజుకు ఆయన మేనల్లుడు. కాకతీయ సామాంతులైన కోయలు ఏటా ప్రభువులకు కప్పం కట్టాల్సిందే. లేదంటే కోపం వస్తుంది. సైన్యం దూసుకొస్తుంది. అదే జరిగింది. ఆ ఏడు మేడారం పరగణాలో పచ్చగడ్డి కూడా మొలవని కరువు నెలకొంది. కన్నీళ్ళు తప్పించి, గుక్కెడు నీళ్ళు కూడా దొరకని రాకాసి కరవు రాజ్యమేలుతోంది. ఆ దుర్భర పరిస్థితుల్లో అమాయక కోయలు కప్పాలెలా కడతారు ? పగిడిద్దరాజు పరిస్థితిని వివరించాడు. అయినా ప్రభువుల గుండె కరగలేదు. కప్పమో, కయ్యమో తేల్చుకోమన్నారు. గడువు ముగిసింది. ఓరుగల్లు సేన మేడారం వైపు కదిలింది. లక్నవరం చెరువు ఒడ్డున డేరాలు వేసింది. గిరిజనులు ఆత్మాభిమాన యుద్ధానికి సిద్ధం అయ్యారు. పగిడిద్ద రాజు తన సైన్యంతో కదనానికి బయల్దేరాడు. వెనకాలే ఆయన కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు ప్రతాపరుద్రుడి సైన్యాన్ని సంపెంగవాగు దగ్గర నిలువరించారు. పాలకుల అహంకారానికి గిరిజనుల ఆత్మాభిమానానికి భీకర యుద్దం జరిగింది. అటువైపున సామాన్యులేం కాదు... కాకలు తీరిన సైన్యం... అయినా గిరిజనం వెనకడుగు వేయలేదు. సారలమ్మ పులిలా వేటాడింది. శత్రువులపై ఉరికింది. కత్తులతో కుత్తుకలు తెగనరికింది. జంపన్న శౌర్యం వీరాభిమన్యుడిని తలపించింది. కాకతీయుల పద్మవ్యూహల్ని అవలోకగా చేధించుకుంటూ ముందుకు ఉరికాడా వీరకుమారుడు.

గుండె ధైర్యమే మరణ ఫిరంగిగా పొరుసల్పుతున్న గిరిజన దండు ఎంతకాలమని ఆ దండయాత్రకు ఎదురుతిరుతుంది. ఆయుధాలు నిండుకున్నాయి. వనరులు అడుగంటాయి. యోధులంతా నేలకొరిగారు. పగిడిద్దరాజు ప్రాణాలు కొల్పోయాడు. నాగులమ్మ నేల కూలింది. సారలమ్మ వీర మరణం పొందింది. గోవిందరాజు తలవాల్చాడు. ఆ ఘోరాన్ని చూడలేక, జంపన్న సంపెంగ వాగులో దూకాడు. ఆ వాగు జంపన్నను బిడ్డలా ఒడిసి పట్టుకుంది. వీరమాత అనిపించుకోవాలంటే ఎంత అద్రుష్టం ఉండాలి.  అందుకనేమో, సంపెంగవాగు పేరు మార్చుకొని జంపన్నవాగు అయ్యింది. పెనిమిటి, పిల్లలు నేల కూలిన వార్త సమ్మక్కకు చేరింది. ఆ తల్లి విషాద దేవత అయ్యింది. ఓ కంట కన్నీరు, ఓ కంట నిప్పు కణికలు. సైన్యాన్ని వెంటపెట్టుకుని సమరానికి బయల్దేరింది. కాకతీయ ప్రభువుల గుండెల్లో దడపుట్టించింది. శత్రు సైనికుల్ని జంపన్న వాగులో ముంచి తేల్చింది. పాలకులకు చెమటలు పట్టాయి. పిరికితనం ఆవహించింది. సమ్మక్కను వెనుక నుండి బల్లాలతో పొడిచి... దొంగదెబ్బ తీశారు. ఆ ఘోరాన్ని చూసి నేల తల్లి కళ్ళెర్ర జేసింది. రక్త ధారలతో ఆ ప్రాంతం ఎర్రబారి పోయింది. నెత్తురోడుతూ... సమ్మక్క మేడారానికి ఈశాన్యంగా ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్ళి మాయం అయ్యింది. కొయదొరలు.. కన్నీళ్ళు పట్టుకున్నారు. దివిటీలు పట్టుకొని గాలించారు. ‘అక్కా సమ్మక్కా’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. జాడ లేదు, జవాబు లేదు, అంతలోనే ఓ కబురు. గట్టు మీద నెమలినార చెట్టు వద్ద... పుట్టకాడ.. ఒక కుంకుమ భరిణ కనిపించిందంటూ... అదే సమ్మక్క ఆనవాలని నమ్మారు. నిద్రహారాల్లేవు. ఆకలిదప్పులు లేవు. ఆ త్యాగమూర్తి రాకకోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు. వారాలు గడిచాయి. నెలలు నిండాయి. ఓ రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. ‘‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఈ స్థంలో రెండు గద్దెలు కట్టింటి, రెండేళ్ళకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి’’ అని ఆకాశవాణి పలికింది. అది సమ్మక్క స్వరం. ఆ సంఘటన ప్రతాపరుద్రుడిలోనూ మార్పు తెచ్చింది. తప్పు తెలుసుకున్నాడు. అహాన్ని వదులుకున్నాడు. సమ్మక్క – సారలమ్మలకు భక్తితో జాతర జరిపించాడు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కోటలు బీటలు వారాయి. సమ్మక్క – సారలమ్మ వనదేవతలై పూజలందుకుంటున్నారు.

మహా వైభవంగా....

Shivasattuluరెండేళ్ల కోసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుంది. జాతర ప్రారంభమైన తొలి రోజునే సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్ద రాజు గద్దెలపైకి వస్తారు. గిరిజన సాంప్రదాయంలో విగ్రహరాధన ఉండదు. వెదురు, భరిణె తదితర ప్రతీకలే ఉత్సవమూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే నేటి గద్దె అని చెబుతారు.
మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెవెల్లి గ్రామంలో గిరిజనుల మేళతాళాలతో, డోలి చప్పుళ్లతో సారలమ్మను తీసుకొని ఊరేగింపుగా బయల్దేరుతారు. సారలమ్మకు మొత్తం ఆరుగురు పూజారలు. పూజారుల సహాయకుడు వడ్డె. ఇతనే సారలమ్మను గద్దె  పైకి తెస్తాడు. సారలమ్మను గద్దె పైకి తెస్తున్నప్పుడు వందలాది మంది భక్తులు ఆలయం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు బొక్కబోర్లా పడుకొంటారు. పూజారులూ వడ్డె, వారిని తొక్కుకుంటూ సారలమ్మను తీసుకొస్తారు. ఆలయ ప్రాంగణంలో మేకను బలివ్వడం సంవ్రదాయం. అది కూడా మేక జడ్తీ ( జడ్తీ అంటే ఒక రకంగా బలికి తలూపడం) ఇస్తేనే. కన్నెవెల్లిలో ప్రారంభమైన ఊరేగింపు సుమారు ఆరుగంట తర్వాత మేడారం చేరుకుంటుంది. జాతరకు రెండు రోజుల ముందే.... కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని పూజారి పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. దాదాపు తొంభై కిలోమీటర్లు నడిచి జాతర నాటికి మేడారానికి వచ్చేస్తుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్ద రాజు ప్రత్యక్షమౌవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజు ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువై ఉంటాడు. జాతర రోజు ఉదయమే గ్రామస్తులంతా కలిసి గోవిందరాజును తీసుకొని ఊరేగింపుగా బయల్దేరుతారు. అలా ఒకేరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. మరుసటి రోజు సమ్మక్కని చిలకల గట్టు పై నుండి తీసుకొచ్చి, భక్తుల జయజయధ్వానాల మధ్య గద్దె  పై కూర్చోబెడతారు. నాలుగు రోజుల పాటు అంగరంగా వైభవంగా జాతర జరుగుతుంది. పూజారుల దేవతలను వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది.

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం. మదినిండా భక్తి భావం, కోయదొరల జ్యోస్యాలు, సర్వరోగాలకూ చెట్లమందులు, నెమలి పింఛాలు, శివసత్తుల పూనకాలు ఎడ్లబండ్ల సవ్వడులు... ఆ సందడే వేరు... జానపదుల జాతరంటే మేడారం జాతరే. మరి ఇంకెందుకాలస్యం మీరు కూడా ప్రయాణానికి సిద్ధంకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  End of the world december21 2012
Ingapore city tourism and travel information  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles