టీవీ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి.. తనదైన శైలిలో ప్రతిఒక్కరిని నవ్విస్తూ గొప్ప హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు ‘‘ధర్మవరపు సుబ్రహ్మణ్యం’’గారు. ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయనగారు.. తన చిన్నతనం నుంచే అనేక కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కుంటూ నాటకారంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు.
దూరదర్శన్ లో ప్రసారమైన ‘‘ఆనందోబ్రహ్మ’’ డైలీ సీరియల్ లో యర్రంశెట్టి పాత్ర ద్వారా పరిచయం అయిన ఈయనగారు... తన నటనతో మంచి గుర్తింపును పొందారు. అంతేకాకుండా ‘‘తోకలేని పిట్ట’’ సినిమాకు కూడా ఈయన దర్శకత్వం వహించారు. అయితే అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దర్శకత్వ బాధ్యతలను విరమించుకున్నారు. అయితే కాలేయ కేన్సర్ తో బాధపడుతున్న సుబ్రహ్మణ్యంగారు... చైతన్యపురిలోని గీతా ఆసుపత్రిలో డిజెంబర్ 7 2013వ సంవత్సరంలో తుదిశ్వాసను విడిచారు.
బాల్యం - విద్యాభ్యాసం - ఉద్యోగ జీవితం :
ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ప్రకాశం జిల్లాల్లోని బల్లికురవ మండలం, కొమ్మినేనివారి పాలెంలో 1954 సెప్టెంబర్ 20వ తేదీన ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో.. ఆయన తల్లే ఎన్నో కష్టాలను ఎదురుకుంటూ తన నలుగురు పిల్లలను పోషించి పెద్ద చేసింది. అటువంటి కష్టతర పరిస్థితులను కూడా ఎదుర్కుంటూ సుబ్రహ్మణ్యంగారు తన ఉన్నత విద్యను అద్దంకిలోనూ.. ఇంటర్ విద్యను ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కళాశాలలో పూర్తి చేశారు.
కళాశాలలో చదువుతుండగానే ఆయనకు నాటకాల రంగం మీద ఎంతో ఆసక్తి వుండేది. ఆ ఆసక్తితోనే ఆయన ప్రజానాత్యమండలిలో పాల్గొన్నారు. అయితే నాటకంలో ఆసక్తి ఎక్కువగా వుండటం వల్ల ఆయన అప్పట్లో చదువులో రాణించలేకపోయారు. తరువాత ఇంట్లో వున్న కష్ట పరిస్థితులను, అమ్మ బాధను తెలుసుకుని సప్తిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించారు. అలాగే బీకాంలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణతను పొందారు.
అయితే సినిమాలవైపు ఆయన మనసు మళ్లడంతో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా మద్రాసుకు పారిపోయారు. అక్కడ ఎన్నో అనుమానాలు, కష్టాలు, నష్టాలు భరించిన తరువాత కూడా ఎటువంటి అవకాశాలు దక్కలేదు. దాంతో ఆయన తిరిగి తన సొంతూరుకు చేరుకున్నారు. మద్రాసు నుంచి తిరిగి వచ్చిన తరువాత తన మిత్రుల సహాయంతో పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు రాసి, ఉత్తీర్ణులయ్యారు. దాంతో ఆయనకు హైదరాబాద్ లోని పంచాయితీరాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం లభించింది.
అయినప్పటికీ ఆయన దృష్టి మాత్ర నాటకాలు, సినిమాలవైపే వుండేది. దాంతో ఆయన ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశారు. అలాగే దూరదర్శన్ లో తొలి తెలుగు ధారావాహిక అయిన ‘‘అనగనగా ఒక శోభ’’ను ప్రారంభించారు. అలాగే ‘‘మనసు గుర్రం లేదు కళ్లెం’’, ‘‘పరమానందయ్య శిష్యుల కథ’’ వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో.. ‘‘ఆనందో బ్రహ్మ’’ ద్వారా టీరీ రంగానికి పరిచయమయ్యారు.
సినిమా జీవితం :
దూరదర్శన్ లో ప్రసారమవుతున్న టీవీ సీరియల్ లో ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు నటిస్తుండగానే.. ప్రముఖ దర్శకుడైన జంధ్యాలగారి ‘‘జయమ్ము నిశ్చయమ్మరా’’ సినిమాలో అవకాశం వచ్చింది. అలా ఆ విధంగా తెలుగు సినిమా తెరకు పరిచయమయిన ఆయన... తన నటనశైలితో హాస్యనటుడిగా పేరు పొందారు. సినిమాలలో నటిస్తుండగానే ‘‘తోకలేని పిట్ట’’ సినిమాకు సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు.
ఆ తరువాత ధైర్మం, నువ్వునేను, ఇంకా ఇతర సినిమాల్లో అధ్యాపక పాత్రతో ప్రతిఒక్కరిని కడుపుబ్బా నవ్వించారు. అలాగే ఒక్కడు సినిమాలో పాస్ పోర్ట్ ఆఫీసర్ గా, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించుకున్నారు. ఆయన నటించిన ‘‘ఆలస్యం అమృతం’’ అనే సినిమాకు ‘‘ఉత్తమ హాస్యనటుడి’’గా నంది అవార్డు కూడా లభించింది.
కొన్నాళ్ల తరువాత ఆరోగ్య సమస్యలు ఎదురయినప్పటికీ ఆయన మాత్రం సినిమాలకు దూరం అవ్వలేదు. సాధ్యమైనంతవరకు తనదైన నటనతో ప్రతిఒక్కరితో నవ్వించడానికి ప్రయత్నించారు. తన చివరి సినిమా అయిన ‘‘ప్రేమ గీమా జాన్తానై’’లో నటించిన తరువాత 2013 డిసెంబర్ 7వ తేదీన కన్నుమూశారు.
కుటుంబం - రాజకీయ జీవితం :
ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారి భార్య శ్రీమతి కృష్ణజ. వీరిద్దరికీ రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ అనే ఇద్దరు కుమారులు వున్నారు. పెద్ద కుమారుడు వ్యాపార రంగంలో తన స్థానాన్ని స్థిరపరుచుకోగా.. చిన్న కుమారుడు ఇంకా విద్యను అభ్యసిస్తున్నాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు 1989వ సంవత్సరంలో ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాజకీయరంగంలో కూడా తనదైన కృషిని అందించిన ఆయన... సాంస్కృతిక మండలికి అధ్యక్షునిగా కూడా పనిచేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more