వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్ లో ఇప్పుడిప్పడే కుదుట పడుతోంది. గత పది రోజుల పాటు వరుణుడి ప్రళయ తాపానికి జలవిలయం మధ్య అక్కడి ప్రజలు విలవిలలాడారు. విద్యుత్, సమాచార సంబంధాలు తెగిపోడంతో కప్పకూలిన సమాచార వ్యవస్థ పునరుద్దరణ పనులు నిర్వహిస్తున్నారు. దారులు కోతకు గురవ్వడంతో గత పది రోజులుగా రోడ్డు రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. పల్లెలు పట్టణాలు, నగరాలు జల సమాధి నుంచి ఇప్పుడిప్పడే సాధారణ పరిస్థుతులకు చేరుకుంటున్నాయి. అనేక చోట్ల పునరావాస కేంద్రాల్లో వున్న ప్రజలు వారి స్వగృహాలకు పయనమవుతున్నారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని ఎట్టకేలకు అధికారులు ఇవాళ తెరిచారు. వర్షాలతో రహదారిపై విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగించారు. వరదలతో ఈ రహదారి అక్కడక్కడా కోతలకు గురైందని, డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అక్కడక్కడా కొండచరియలు విరిగిపడడంతో రొడ్డు కుంగిపోగా వాటికి అధికారుల మరమ్మతులు చేస్తున్నారు. పర్వత ప్రాంతానికి ముఖ్యమైన రహదారి తెరవడంతో వరద ప్రభావిత ప్రాంతాలకు సరుకులను రవాణా చేయవచ్చని దీంతో గత పది రోజులుగా పూట తిని, తినక పస్తులు వున్న ప్రజలకు ఆహార పదార్థలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. పది రోజుల తరువాత రహదారి తెరవడంతో.. ఒక్కసారిగా రోడ్డుపై ట్రాపిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బనిలాల్, రాంబన్, బటోటే, కుడ్, పట్నీటాప్, చినాని, ఉదంపూర్, జమ్మూ తదితర ప్రాంతాల్లో రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more