(Image source from: father killed his daughter and bruthally beater her wife)
రానురాను మన దేశంలో మానవత్వం మంటగలిసిపోతుందనడానికి ఇదొక మంచి ఉదాహరణ! తన కన్నకూతురు అని చూడకుండా దెయ్యం పట్టిందనే సాకుతో దారుణంగా హతమార్చాడు. కేవలం తన కూతురినే కాదు.. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కూడా హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే చుట్టుపక్కల వున్న స్థానికులు స్పిందించడంతో ఆమె బతికిబయటపడింది.
విజయనగరంలోని ఎస్ కోట ప్రాంతంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాలక్రమంలో భార్య, కూతుళ్ల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ దెయ్యం పట్టిందని భావించిన అతను... ఇద్దరిని ఒక గదిలో వేసి దారుణంగా కొట్టాడు. ఇలా కొన్ని నిముషాలతరబడి కొడుతున్న నేపథ్యంలో కూతురు అక్కడికక్కడే చనిపోగా... భార్య తీవ్రంగా గాయపడింది. అయితే చాలాసేపటివరకు అరుపులు వస్తున్న కారణంగా స్థానికులు ఏం జరుగుతుందోనని చూడగా.. అతను తన భార్యను కొడుతున్నాడని గమనించివాళ్లు.. వెంటనే స్పందించారు. తీవ్రంగా గాయపడిన సదరు మహిళను ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారాన్ని సేకరించిన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ‘‘దెయ్యం పట్టిందనే కారణంతోనే తమపై భర్త చాలా దారుణంగా దాడి చేశాడు’’ అని పోలీసులకు తెలిపింది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘాతుకం వెనుక ఏదైనా బలమైన కారణం వుండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more