వివాదాలకు కేంద్రబిందువైన ఎంసెట్ కౌన్సిలింగ్ మరో గందరగోళానికి తెరతీసింది. సీట్ల రద్దుపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ర్టాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో దృవపత్రాల పరిశీలన జరుగుతోంది. అయితే ఈ సారి కౌన్సిలింగ్ లో యునివర్సిటీ ఒక కొత్త నిబంధన తీసుకువచ్చింది. విద్యార్థులు ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత సీటు రద్దు చేసుకుంటే లక్ష రూపాయలు ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన రెండు రాష్ర్టాల్లోనూ అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యునివర్సిటీ వీసీ రవిరాజు తెలిపారు.
విద్యార్థులు కాలేజీల్లో జాయిన్ అయి, ఆ తర్వాత సీట్లు క్యాన్సిల్ చేసుకుంటుండటంతో తమకు తిరిగి సీట్ల భర్తీ ఇబ్బందిగా మారుతుందని అధికారులు అంటున్నారు. మెడిసిన్ లో చేరిన విద్యార్థులు ఇతర కోర్సుల్లో కూడా సీట్లు వస్తే అందులో చేరేందుకు సీట్లు రద్దు చేసుకుంటున్నారు. అంతేకాకుండా వివిధ కారణాలతో జాయిన్ అయి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇలా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత సీటు క్యాన్సిల్ చేసుకుంటే.., ఆ సీటును మరొకరికి ఇవ్వలేమని., అందువల్ల ఐదు సంవత్సరాల పాటు ఆ సీటు వృదాగా పోతుందని చెప్తున్నారు. ఇలా జరగకుండా చూసేందుకే సీటు రద్దు చేసుకుంటే లక్ష రూపాయల నిబంధన తీసుకువచ్చామన్నారు.
అయితే ఈ నిబందనపై విద్యార్థుల తల్లితండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు చదువుకునే స్వేచ్చ ఇవ్వకుండా వర్సిటీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని మండిపడుతున్నారు. ఉన్నత కాలేజీలు, యునివర్సిటీల్లో సీట్లు వస్తే కూడా వద్దనుకుని ఇక్కడే ఉండమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మెడిసిన్ పై మక్కువ ఉన్న విద్యార్థులకు మేలు జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు సమర్ధించుకుంటున్నారు. రెండు రాష్ర్టాల్లో ముందుగా చేరిన 200మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందిస్తామని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బుట్టా శ్రీనివాస్ వెల్లడించారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more