కాంగ్రెస్ సీనియర్ నేతగా.., పార్టీ అధినేత్రి ఇంటికి సైతం నేరుగా వెళ్లే సత్తా ఉన్న హనుమన్నకు ఘోర పరాభవమే ఎదురయింది. నిండు కాంగ్రెస్ సభలో వీహెచ్ ను దిగ్విజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. వీహెచ్ పలుకుబడి, పార్టీ కార్యకర్తల్లో ఆయనకున్న పేరు తెలిసి కూడా డిగ్గీ అవమానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలు.., పార్టీ భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై చర్చించేందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సమీపంలో తెలంగాణ కాంగ్రెస్ సమావేశమైంది. ఈ భేటికి రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం మొదలయింది. ఎప్పుడూ కార్యకర్తల పక్షాన ఉండే వీహెచ్ ఈ సభలో కూడా వారి ప్రస్తావన తెచ్చారు. కార్యకర్తలను మాట్లాడించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరారు. ఓటమికి గల కారణాలు, పార్టీ బలోపేతం కోసం సలహాలు ఇచ్చేందుకు వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. అయితే తర్వాత చూద్దాంలే అంటూ దిగ్విజయ్, ఇతర నేతలు చెప్పారు. అయినా సరే వీహెచ్ వినిపించుకోలేదు.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను మాట్లాడించనపుడు ఈ సమావేశం ఎందుకు అని ముఖ్య అతిధిగా హాజరైన దిగ్విజయ్ ను నిలదీశారు. తర్వాత చూద్దాం అని జానా వంటి సీనియర్లు సూచించినా హనుమంతు పట్టు వీడలేదు. దీంతో వీహెచ్ పై దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత చూద్దామంటే అర్ధం కాదా అన్నట్లుగా ఫైర్ అయ్యారు. ఇద్దరి మద్య గొడవ పెద్దది అయ్యేలా కన్పించటంతో జోక్యం చేసుకున్న జానారెడ్డి.., హన్మంతరావును పక్కకు తీసుకెళ్ళి బుజ్జగించారు. కార్యకర్తలకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగి సమావేశం తిరిగి ప్రారంభమైంది.
కార్యకర్తల కోసం పోరాడే వీహెచ్ కు జరిగిన అవమానంపై ఆయన అనుచరులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగ్విజయ్ దురుసుగా ప్రవర్తించటంపై మండిపడుతున్నారు. ఇంధిరా కాలం నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా వారితో నేరుగా మాట్లాడగలిగే సత్తా ఉన్న నేతకు జరిగిన అవమానంపై ఆగ్రహంగా ఉన్నారు. ఇదంతా ఎలా ఉన్నా.., కాంగ్రెస్ లో నేతలకే తప్ప కార్యకర్తలకు అవకాశాలు ఉండవని ఈ సమావేశంతో మరోసారి నిరూపితమైందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more