రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని గతంలో కెసిఆర్ ఉద్రేకంగా ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై నిజామాబాద్ మాజీ లోక్ సభ సభ్యుడు మధుయాష్కి ఫైర్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని గతంలో ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.సానియా మీర్జాకు కోటి రూపాయలు ఇచ్చిన కెసిఆర్,తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మాత్రం పుష్పగుచ్చాలు ఇచ్చి సరిపెడుతున్నారని యాష్కి వ్యాఖ్యానించారు.
సిమెంటు ధరల పెరుగుదల వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల విషయంలో ఎందుకు అఖిలపక్షం నిర్వహించలేదని యాష్కి ప్రశ్నించారు.ప్రతిదానికి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మధు యాష్కి ధ్వజమెత్తారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. చిల్లర పార్టీలంటూ ఎదురుదాడికి దిగడం, తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలు కేసీఆర్ అహం కార ధోరణికి నిదర్శనమన్నారు.
టీఆర్ఎస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని, హద్దుమీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
--------------
KCR had earlier pledged to recover the lands of Ramoji Film City accusing the media baron Ramoji of encroaching them illegally
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more