అధికార పార్టీ మాటల గారిడీతో ప్రజలను మభ్యపెట్టుతుందే తప్ప.. ప్రజాహిత కార్యక్రమాలకు పూనుకోవడం లేదని, ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని.. మరీ ముఖ్యంగా రైతన్నల అక్రంధనలను తీర్చేందుకు పూనుకోవడం లేదని నిరసిస్తూ.. అక్టోబర్ 3న సత్యగ్రహ దీక్షను పూనుకోనుంది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి. ఈ మేరకు జేఏసీ అధ్యక్షడు కోదండరామ్ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.
రైతు సమస్వయ సమితులకు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిస్తూ.. మండల కేంద్రాల్లో ధర్నాలకు దిగాలని, రాష్ట్రస్థాయిలో సత్యగ్రహ దీక్షలకు పూనుకుంటామని కొదండరామ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన సత్యగ్రహ దీక్షకు తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. దీంతో తెలంగాణలో కూడా ఎన్నికల వాతావరణం అప్పుడే వేడి రాజుకుంటుందా..? అని అన సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఈ మేరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కోదండరామ్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరైన పలు పార్టీల నేతలు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. పంచాయతీలతో పాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖలను బలహీన పరిచేలా సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. సుదీర్ఘకాలంగా వస్తున్న వ్యవస్థలపూ నమ్మకం లేకనే రైతు సమన్వయ కమిటీలను వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. జీవో నం39 వెంటనే ఉపసంహరించుకోవాలని కోదండరామ్ సహా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.
అయితే కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని విమర్శలు చేసి ఆయనను సైడ్ ట్రాక్ చేయాలని చూసిన అధికార వ్యూహాలు మాత్రం ఫలించకపోవడం.. అధికార పార్టీలో కొంత నిరాశ వ్యక్తమవుతుది. కొదండరామ్ ను నిలువరించడం ఎలా అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నా.. అతి తమకు లాభించకపోయినా.. నష్టపర్చే విధంగా వుండకూడదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కొదండరామ్ అధ్వర్యంలోనే తెలంగాణకు ఒక రూట్ మ్యాప్ వచ్చిందని.. ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమైందని కూడా గతంలో పలుమార్లు ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట మార్చి ఆయనపై విమర్శలను ఎక్కుపెడితే.. వాటిని తెలంగాణ ప్రజలు తోసిపుచ్చుతున్నారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. అధికారపార్టీపై గురిపెట్టిన కొదండరామ్.. సత్యాగ్రహ దీక్షతో తెలంగాణలో ఎన్నికల కారుసెగలను రగలించడంలో సఫలీకృతం అవుతారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more