దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ విజయంతో ఎలాగైనా పునర్వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, స్థానిక పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీసి పగ్గాలు చేపట్టాలని బీజేపీ తీవ్రంగా భావిస్తున్నాయి. మరో 15 రోజుల్లో ఈ రెండు తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. దేశానికి గుండె కాయ వంటి యూపీ లో రాజకీయాలు, సీఎం అభ్యర్థి ఎంపిక వంటి అంశాలు అనుకున్నంత సులువు కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఉంటాయి ఇక్కడి వ్యవహారాలు. ఉదాహరణకు సీఎం అభ్యర్థిగా బ్రాహ్మణులను ఎంపిక చేస్తే ఠాకూర్లకు కోపం, ఠాకూర్లను ఎంపిక చేశారనుకోండి యాదవులకు మండిపడతారు, పోనీ దళితులను ఎంపిక చేస్తే అగ్రవర్ణాలకు మంట ఇలా ఉంటాయి అక్కడి రాజకీయాలు.
కానీ, మెజార్టీ ఉన్న బ్రాహ్మణ ఓటర్లే ఇక్కడ కీలకం కానున్నాయి. రాష్ట్ర ఓటర్లలో 10 నుంచి 12 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గంపైనే పార్టీలన్నీ ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఆ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా బ్రాహ్మణ ఓటర్లు రామ మందిర్ రాజకీయాలతో బీజేపీవైపు మళ్లారు. దీంతో ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, ఏఐసీసీ పరిశీలకుల్ని కూడా ఆ వర్గం వారినే నియమిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఏఐసీసీ ఇన్చార్జ్గా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు పరిశీలనలో ఉండగా, ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అల్రెడీ రంగంలోకి దిగిపోయి లెక్కలు వేయడం మొదలెట్టారు. సోనియా వారసుల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బావుంటుదని ప్రశాంత్ ముందుగా అనుకున్నారు. మరీ ముఖ్యంగా రాహుల్ కన్నా ప్రియాంక గాంధీ అయితే తన పని ఇంకా సులువు అవుతుందని ఆయన భావించారట. అదే సమయంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ చురుకైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన చాలన్న ఆప్షన్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ విషయానికొస్తే... ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్మృతీ ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎన్డీయే సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న ఆర్ఎస్ఎస్, బయటి రాష్ట్రాలకు చెందిన వారు వద్దని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రజాదరణగల మహిళా నేతగా స్మృతి ప్రత్యర్థులకు గట్టి సవాళ్లను విసరగలదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కాదంటున్నంత మాత్రాన స్మృతీ అభ్యర్థిత్వంపై వెనుకంజ వేసినట్టు కాదని బీజేపీ అధికార వర్గాలు అంటున్నాయి. పార్టీ పగ్గాలను మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు అప్పజెప్పింది. ఒకవేళ కాంగ్రెస్ స్ట్రాటజీ మార్చి ప్రియాంక గాంధీని గనుక బరిలోకి దించితే మాత్రం పోటీగా కేంద్ర హోంమంత్రి, యూపీ మాజీ సీఎం రాజ్ నాథ్ సింగ్ ను నిలిపే అవకాశం ఉంది. అప్పుడు పోటీ రసవత్తరంగా మారటం ఖాయం. ప్రస్తుతం దేశ మంతా ఈ రెండు పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతాయన్న అంశంపైనే తీవ్రంగా చర్చించుకుంటున్నాయి.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more