రాఖీ సావంత్ కు బలైన వారు చాలా మంది ఉన్నారు. ఆ వరుసలో.. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, రాందేవ్ బాబా అలాంటి వారు రాఖీ సావంత్ మాటలకు బలైయ్యారు. మీకు ఓకే అంటే.. మిమల్ని నేను పెళ్లి చేసుకుంటానని .. పెళ్లి గానీ ప్రసాదులకు నిద్రలేకుండా చేసింది.
అయితే ఇప్పుడు ‘‘ముంబయి ఛీపురు కట్టను .. చూసి పచ్చిమిరపకాయతో వాతలు పెట్టుకుంది’’ అంటే అరవింద్ క్రేజీ వాల్ పెట్టిన పార్టీని ఆదర్శంగా తీసుకొని రాఖీసావంత్ 'రాష్ట్రీయ ఆమ్ పార్టీ ’ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి పచ్చిమిరపకాయ్ ను పార్టీ సింబల్ గా పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగింది.
అసలే ఐటమ్ గర్ల్ ..అందులో పచ్చిమిరపకాయ్ గుర్తు.. ప్రజలు తెగ కొరికేస్తారని ..రాఖీ సావంత్.. చాలా ఆనందం పడింది. రాజకీయ పదవి పై రాఖీ చాలా కలలు కన్నది. కానీ చివరకు.. రాఖీ పచ్చిమిరపకాయ్ ను కోరికే మగవారే కరువయ్యారు. ఇతర పార్టీల తరపున కాకుండా ఆమెనే స్వంతంగా పార్టీ పెట్టి వాయివ్య ముంబై నుండి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటర్లు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.
'రాష్ట్రీయ ఆమ్ పార్టీ' అని నామకరణం చేసి ప్రచారం చేశారు. వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసింది. ఎన్నికల పోలింగ్ అప్పుడు కూడా తనదే విజయం అని మురిసిపోయింది. ఫలితాల రోజు టీవీ ఎదుట కూర్చొంది. మూడో రౌండ్ పూర్తయింది. అంతే వాస్తవం ఎంత కఠినంగా ఉంటుందో అర్థమైంది. దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
అసలు రాఖీకి ఓట్లు ఎన్ని వచ్చాయో అనేగా...థర్డ్ రౌండ్ వరకు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. తరువాత మరో 1995 వచ్చాయి. అంటే కేవలం రెండు వేల లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. 'తన ఓటమికి చెందడానికి కారణం నా దగ్గర కోట్ల రూపాయలు లేవు' అంటూ చెప్పుకొచ్చింది. ..చివరకు ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ పార్టీలో ఉన్నది ఎంత మంది ? ఆమె ఒక్కతే...
కొసమెరుపు : ఆమె ఒప్పుకుంటే..రొమాన్స్ చేయటానికి .. కోట్ల మంది క్యూ కడతారు గానీ , ఓటు వేయమంటే ఎందుకు వేస్తారు రాఖీ? ప్రజా సేవా చేస్తాను..నాకు ఓటు వేయండి అని అంటే..కేవలం రెండు వేల మంది మాత్రమే రాఖీ సావంత్ పచ్చి మిరపకాయ్ పై ఓటు వేశారు.
రాఖీ రంగుల కల తీరకుండానే రాజీనామ చేయటంతో ఆమెకు ఓటు వేసిన రెండు వేల మంది ధర్నాకు దిగే అవకాశం ఉందని.. ముంబయి వాసులు అంటున్నారు. రాఖీ రాజీనామా చేస్తే.. మాకు నష్టపరిహారం ఇవ్వల్సిందేనని ఓటు వేసిన రెండు వేల మంది డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చివరకు ఓటర్ కష్టాల్లో చిక్కుకున్న రాఖీ గా పేరుతెచ్చుకుంది. అంతేకాంకుడా అందరు మిరపకాయ్ ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more