అవును ఇప్పుడు ఓటు వేయడం దండగ అనే ప్రచారం పల్లెల వరకు పాకింది. అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఆ పార్టీలో సినీయర్ నాయకులు అంటున్నారు. రాష్ట్ర విభజన నెత్తిన పెట్టుకొని, ఒక ప్రాంతం ప్రజల పై కాంగ్రెస్ పార్టీ చేసిన నేరాల, ఘోరాల ఫలితమే ఇప్పుడు ఇలా ఉందని రాజకీయ విశ్వేషకులు అంటున్నారు.
తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించిన పార్టీ ఆ హామీని అప్పుడే నిలబెట్టుకోవాల్సింది. అలా చేయలేదు. పోనీ ఎప్పుడు నిలబెట్టుకుంటారో కూడా చెప్పలేదు. పదేళ్ల పాటు రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒకర్నొకరు తిట్టుకునేలా, కొట్టుకునేలా చేసి, లోక్సభ తలుపులు మూసేసి, సీమాంధ్ర ప్రాంతం ఈ దేశంలోనిది కాదు అన్నట్లు రాష్ట్రాన్ని విభజించి తన పంతం నెగ్గించుకున్న పార్టీ కాంగ్రెస్. ఇలాంటి పార్టీని జనం అసహ్యించుకోకుండా ఎలా ఉంటారని ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.
కాంగ్రెస్ అంటే ఒకప్పుడు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా ప్రజల్లో గౌరవం, అభిమానం ఉండేవి. అలాంటిదిప్పుడు కాంగ్రెస్ అంటే అరాచకాలకు, అక్రమాలకు, లక్షల కోట్ల కుంభకోణాలకు పెట్టింది పేరుగా మారింది. తన రాజకీయ అవసరాల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడని పార్టీగా మారిందని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తితే.. చాలు జనం అతని చేతులు నరికిన ఆశ్చర్యపడాల్సిందేమి లేదని ఆ పార్టీ కార్యర్తలు అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితిని చూస్తుంటే జనంలో ఆ పార్టీపై ఎంత కోపం ఉందో అర్థమవుతుంది. తల్లి, కొడుకు సభలు సీమాంద్ర లో పెడితే ఖాళీ కూర్చీలతో మాట్లాడి వెళ్లిపోయిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తల్లీ కుమారులకు జనంలో ఏ స్థాయిలో ఆదరణ ఉందో తెలుసుకున్న తరువాత కాంగ్రెస్ నాయకులు మరోసారి వారిని పిలపించే సాహసం చేయలేదు.
మరోవైపు ఓడిపోతామని కచ్చితంగా తెలిసినందున చేతి చమురు వదిలించుకోవడం దేనికి? అనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పదేళ్లుగా భారీగా వెనుకేసుకున్న నేతలు ఎవరూ రూపాయి తీయడానికి ఇష్టపడటం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల అసలు నాయకత్వమే లేకుండా పోయింది. రాయలసీమలో డిపాజిట్ దక్కించుకోగలిగిన నేత అయినా ఉన్నారా? అన్నది అనుమానంగా మారింది. రఘువీర, శైలజానాథ్, సాయిప్రతాప్, చింతా మోహన్లు ఈసారి ఘోరమైన ఓటమిని చవి చూస్తారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నందున కాంగ్రెస్ ఓటు వేయడం దండగ అనే ప్రచారం మారుమూల పల్లెల దాకా పాకిందని కాంగ్రెస్ కార్యర్తలే అంటున్నారు. ఇంలాంటి వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా గెలిస్తే అది నిజంగా అద్భుతమే అవుతుందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more