16 వ లోక్ సభ ఎన్నికలలో మొదటి రోజున మొరాయించిన ఇవిఎమ్ లతో ఇసి అధికారులు ఆదుర్దా చెందుతున్నారు. మొదటి రోజునే 90 ఇవిఎమ్ లను మార్చవలసి రావటంతో వాటి మీద ఎంత వరకు ఆధారపడవచ్చనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
అయితే సమస్యంతా 2006 లోపులో తయారు చేసిన ఇవిఎమ్ లతోనే వస్తున్నాయట. మరి అలాంటప్పుడు వాటిని ఎన్నికలకు ముందుగానే ఇసి ఎందుకు మార్చలేదన్నదానికి సమాధానం వాళ్ళే చెప్పాలి.
నిజానికి ఇవిఎమ్ లు (సరిగ్గా పనిచేస్తే) కౌంటింగ్ విషయంలో ఆధారపడతగ్గవే, సురక్షితమైనవే. ఎందుకంటే ప్రతి ఇవిఎమ్ స్వతంత్రంగా పనిచేసేదే కానీ దేనితోనూ అనుసంధానం చెయ్యదగ్గది కాదు. దానివలన ఒక యంత్రం మరో దానితో నెట్ వర్కింగ్ లో పనిచేసే విధానం లేకపోవటం వలన చేస్తే పోలింగ్ సమయంలో ఏమైనా కుతంత్రానికి పాలుపడటానికి అవకాశం ఉంది కానీ ఆ తర్వాత ఇవిఎమ్ లలో నిక్షిప్తమైన డేటాను ఎవరూ మార్చలేరు. అలా మార్చే అవకాశమే లేదు. అందువలన ఇవిఎమ్ లు ఆధారపడతగ్గవే. కాకపోతే వాటిని కౌంటింగ్ డేట్ వరకు భద్రపరచటం తప్పనిసరి.
ఎన్నికల కమిషన్ డెప్యూటీ కమిషనర్ విశాల్ వసంత్ సోలంకి చెప్పినదాని ప్రకారం ఏప్రిల్ 1 న పరీక్షించినప్పుడు కొన్ని ఇవిఎమ్ లు అన్ని వోట్లనూ భాజపాకి అనుకూలంగా చూపించటంతో గందరగోళానికి దారితీసింది. భాజపా ఇవిఎమ్ లను తనకు అనుకూలంగా మార్చుకుందన్న అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాయి. దానితో ఇవిఎమ్ లను పరీక్షించి చూడగా 2006 లోపులో తయారు చేసిన మిషన్ లే సమస్యాత్మకంగా ఉన్నాయని తేలింది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 600 ఇవిఎమ్ లను పరీక్షించామని చెప్తున్నారు. మొత్తం 1800 ఇవిఎమ్ లు ఉన్నాయి. మిగతా వాటిని కూడా పరీక్షిస్తున్నామంటున్నారు.
తీరా ఎన్నికల సమయం వచ్చేంత వరకూ వేచి చూడకుండా ఎన్నికల కమిషన్ ముందే పరీక్షణలను ఎందుకు చెయ్యలేదని పలువురు అడుగుతున్నారు. పాత మెషీన్లు సరిగ్గా పనిచెయ్యకపోతే వాటిని ముందుగానే మార్చివేయవలసింది అన్న విమర్శలు వస్తున్నాయి.
ఆవిధంగా అస్సాంలో జరిగిన పోలింగ్ లో బయటపడ్డ ఇవిఎమ్ లోపాలతో మిగతా చోట్ల ఎన్నికలు ఎలా జరుగుతాయా, వాటి మీద ఎంత వరకు ఆధారపడవచ్చా అన్న ప్రశ్నలు దేశ వ్యాప్తంగా తలెత్తటం సహజం. ఎలక్ట్రానిక్ యంత్రాల్లో కంటికి కనిపించేదేమీ ఉండదు కాబట్టి వాటి సమర్థతను అవిచ్చే ఫలితాలను సామాన్య ప్రజానీకం కేవలం నమ్మకంతో సరిపెట్టుకోవలసివుంటుంది.
అదే పెద్ద సమస్యగా తయారైంది ఎన్నికల కమిషన్ కి! పేపర్ ట్రయల్ ఆధారంతో వాళ్ళు వోటు వేసిన పార్టీ తో సరిపోలకపోతే వోటర్లు ఫిర్యాదులు చెయ్యవచ్చు. అందువలన పోలింగ్ సరిగ్గా జరుగుతుందన్న నమ్మకమైతే కలుగుతుంది కానీ వాటిని మార్చవలసిరావటం వలన జాప్యం లాంటి అనవసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more