రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి భారీ నష్టమే జరిగిందని కేసిఆర్ మొన్న మీడియా లో చెప్పటం జరిగింది. ఇది అక్షరాల నిజం అని ..తెలంగాణ ప్రాంత రాజకీయ మేథావులు సైతం ఒప్పుకుంటున్నారు.
రాష్ట్ర విభజన జరగటం వల్ల ఎప్పటికి పూడ్చుకొలేని నష్టం తెలుగు ప్రజల మద్య ఉండిపోతుందనే నిజాన్ని కేసిఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పటం జరిగింది. తెలంగాణరాష్ట్రం వచ్చిందన్న ఆనందంకంటే.. రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది అనే బాధతో కేసిఆర్ నిత్యం కుమిలిపోతున్నట్లుగా కనబడుతుందని ఆయన మాటతీరే చెబుతుంది.
పదమూడేళ్లగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న నేతగా కేసిఆర్ పేరు తెచ్చుకున్నారు. రాజకీయ మేథావుల్లో చురుకైన రాజకీయ పండితుడిగా పేరుతెచ్చుకున్నారు. ప్రజా నాడీ తెలిసిన, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజలు మనసును కేసిఆర్ గెలుచుకున్నారు. గానీ రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టం కూడా కేసిఆర్ ముందే తెలుసు. కానీ తన రాజకీయ లబ్థి కోసం, రాజకీయ పదవి కోసం, తెలుగు ప్రజలు రెండుగా విడదీసిన పాపం కేసిఆర్ కే చెందుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు
రాష్ట్రం విభజన జరిగితే తెలంగాణ ప్రాంతం ఇలా నష్టపోతుందని.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , అధికార లెక్కలతో సహా, విద్యుత్, త్రాగు నీరు, మంచినీరు, ప్రాజెక్టులు , రైతులు , తెలంగాణ ప్రజలు ఏ విధంగా నష్టపోతారో మీడియా ద్వారా వివరించి చెప్పటం జరిగింది.
రాష్ట్రం కలిసి ఉంటేనే తెలుగు ప్రజలకు మంచిదని .. కిరణ్ కుమార్ రెడ్డి నెత్తి నోరు బాధుకున్నప్పుడు.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు , కేసిఆర్, కేటిఆర్, హరిష్ రావు మాటల యద్దం చేయటం జరిగింది.
రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు పూర్తి నష్టం జరుగుతుందని తెలిసి కూడా కేసిఆర్ రాష్ట్ర విభజన కోరుకున్నారు. కానీ మూడో తేది కేసిఆర్ ప్రెస్ మీటింగ్ తను చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, భవిష్యత్తులో రాబోయే కష్టాలను మనం ఎదుర్కొనాలని తెలంగాణ ప్రజలకు గీతోపదేశం చేయటం జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం చేయటం లేదని చెబుతూనే.. తమ డిమాండ్స్ ను ..కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటి కూడా తీర్చాలనేదని అన్నారు. అందులో కేసిఆర్ మొదటి డిమాండ్. తెలంగాణ విద్యుత్ కావాలని డిమాండ్ చేయటం జరిగింది.
అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పి నిజాన్ని తెలంగాణ ప్రజలకు కేసిఆర్ స్వయంగా చెబుతున్నారు. అరవైఏళ్లు సీమాంద్ర నాయకుల పాలనలో తెలంగాణ ప్రజలు కష్టాలు అనుభవించారని చెప్పిన తెలంగాణ నాయకులు.. భవిష్యత్తులో రాబోయే కష్టాలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా దూరం చేస్తారో చూడాలని రాజకీయ మేథావులు అంటున్నారు. తెలుగు ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకుండా చల్లగా చూడాలని కట్టమైసమ్మను కోరుకుందాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more