తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దెబ్బకు.. ఇటలీ(సోనియాగాంధీ)కి మైండ్ బ్లాక్ అయింది. కేసిఆర్ దెబ్బతో సోనియాగాందీ సొమ్మసిల్లి పడిపోయినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ రాక ముందు కేసిఆర్ కంటికి ..సోనియా గాంధీ దేవతా? తెలంగాణ వచ్చిన తరువాత సోనియా గాంధీ దేయ్యంగా కనిపించిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిన్న సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలకు విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సోనియాగాంధీ విందులో.. తెలంగాణ కేసిఆర్ పార్టీ విలీనం రుచులను కాంగ్రెన్ నేతలకు పరిచయం చేయటం జరిగింది. సోనియా గాంధీ విందులో ఉన్న స్పీటు , హాట్ లతో పాటు.. తెలంగాణ మసాల ఘాటు తగలటంతో కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది లేదని కేసిఆర్ కుండబద్దలు కొట్టారు. దీంతో సోనియా గాంధీ విందులో తెలంగాణ ఘాటు కనిపించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం అని టీఆర్ఎస్ నాయకులు, అధినేత కేసిఆర్ మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత కేసిఆర్ మాట మార్చి, నా కుటుంబ సభ్యులు, పార్టీ పెద్దలు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకండని వేడుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా పక్క రాష్ట్రాలల ప్రజలు కూడా కేసిఆర్ కు ఫోన్ చేసి , తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ ఉనికి లేకుండా చేయవద్దని కోరినట్లు కేసిఆర్ మీడియా ద్వారా తెలియజేయటం జరిగింది.
అయితే కేసిఆర్ దేనికోసమైన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ లాయర్లు ఆనందంతో పొంగిపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అంటూ.. విమర్శలు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం కాదు అనే చేదు నిజాన్ని సోనియా గాందీ జీర్ణించుకోలేక.. నిన్న జరిగిన విందు పార్టీలో సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ గుసగుసలాడుకుంటున్నారు.
టీఆర్ఎస్ నాయకులు మాత్రం కేసిఆర్ దెబ్బకు.. సోనియా గాంధీ సోమ్మసిల్లి పడిపోయిందని టీఆర్ఎస్ భవన్ లో జోకులు పేలుతున్నాయి. కేసిఆర్, టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనందుకు.. త్వరలో మరో ర్యాలీ పెట్టాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. ఇక కేసిఆర్ పై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ‘‘ఏమైన కేసిఆర్ చాణుక్య తెలివికి ఎట్సాఫ్ చెప్పలని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ’’
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more