టాలీవుడ్ హీరో శివాజీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అనేక హిట్ చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కేవలం నటనతోనే కాలం వెల్లదీయకుండా పౌరుడిగా తన వంతుగా సామాజిక సమస్యలపై పోరాటం చేయటానికి నడుం బిగించారు.
గతం సంవత్సరం జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయణికి నిలువున మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే. అయితే పాలెం బస్సు బాధితుల కోసం పోరాడి…వారికి వెన్నుదన్నుగా నిలిచాడు మన టాలీవుడ్ శివాజీ .
అంతేకాకుండా మరో శివాజీ మరో అడుగు ముందుకేసి, రాష్ట్రంలోని పలు సమస్యలపై తాను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టి మీడియా ముందు చెబుతున్నారు.
అయితే శివాజీ మాటలకు కొంతమందికి అగ్రహం తెప్పిస్తున్నాయి. అయిన శివాజీ వాటిని పట్టించుకోకుండా తన పంధాలో ముందుకు సాగిపోతున్నాడు. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత తాను ఎలా ఫీలైంది వీడియో రూపంలో శివాజీ చెప్పటం జరిగింది.
అయితే ఇందులో మన రాజకీయ నాయకుల్ని ఎకీపరేసాడు. మరో పక్క కెసిఆర్ ని పొగుతుడూనే… సీమాంధ్ర నాయకులపై దుమ్మెత్తి పోసాడు. సీమాంద్ర నాయకుల చేతగానీ తనం వల్లే.. ఈరోజు సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిందని శివాజీ ఆవేశంగా సీమాంద్ర నేతల పై విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర నాయకులకు ఓటెయ్యకూడదని ప్రజలకు శివాజీ పిలుపిచ్చాడు. స్వశక్తితో సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిన ప్రత్యేకంగా పేర్కొంటూ… తెలుగు ప్రజల్ని మోసం చేశాడంటూ ప్రత్యక్షంగా విమర్శించారు.
అయితే శివాజి వదిలిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాక్ గా మారింది. రాజకీయ వర్గాలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో శివాజీ ఏం చేయబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. శివాజీ ప్రత్యక్ష రాజకీయల్లోకి వస్తాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది.
అయితే ఏ పార్టీ, ఎక్కడినుంచి పోటీ చేసే అవకాశముందనే విషయంలో క్లారిటీ లేదు. అన్ని రాజకీయ పార్టీల్ని దుయ్యబట్టిన శివాజీ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఏమైన శివాజీ ఇలా మాట్లాడటం మంచిదికాదని .. ఆయన సన్నిహితులు అంటున్నారు.
అలాగే అడిగే వ్యక్తి ఉంటేనే కదా సమాజం బాగుపడేదని.. మరికొంతమంది నటుడు శివాజీ పై అభిమానంతో మాట్లాడుతున్నారు. శివాజీ హీరో గా ముందువెళ్లతాడో, లేక రాజకీయలకు దూరంగా వెళ్లతాడో, యువ నాయుకుడిగా సమాజ సేవ చేస్తారో చూద్దాం. ఏమైన నటుడు శివాజీలో.. ఒక నాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉన్నయాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more