కమలం పువ్వు ఇప్పుడు పొద్దుతిరుడు పువ్వుగా మారుతుంది. సూర్యోదయం వెళ .. జై తెలంగాణ అని.. చంద్రోదయం వేళ .. జై సమైక్యాంద్ర అంటూ కాలం గడుపుతున్న కమలం గుర్తు నాయకుల తీరు ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇప్పుడు సీమాంద్ర ప్రజలు, సమైక్యవాదులు కమలం పార్టీలోని సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడు ఉండేది సీమాంద్రలో అయిన. ఎక్కువ సార్లు జై కొట్టింది మాత్రం తెలంగాణకే.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజీ మైదానంలో తెలంగాణ ఇస్తే మాకు ఎలాంటి అభ్యర్థం లేదు, కాంగ్రెస్ పార్టీ కావాలని తెలంగాణ ను అడ్డుకుంటుందని, తెలంగాణ బిల్లు ఇప్పుడు పెట్టిన .. మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రజల సాక్షిగా 2013లో చెప్పటం జరిగింది. అదీ కూడా తామరాకంత నాలుకతో పలికిన మాటలకు .. తెలంగాణ ప్రజలు , తెలంగాణ బిజేపి నాయకులు .. దవత్తులతో పండుగ జరుపుకున్నారు.
కమలం పువ్వోళ్లు కూడా.. తెలంగాణకు అనుకూలమే అనే సంకేతాలను హస్తా గుర్తు అమ్మకు పంపటం జరిగింది. దీంతో కమలం గుర్తొళ్లో ఒప్పుకున్నారు కాబట్టి, ఆంద్రప్రదేశ్ లో.. తెలంగాణ వార్ పుట్టించారు. మొన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న తెలుగు ప్రజలు , నాయకులు .. రెండు ప్రాంతాల వారికిగా విడిపోయి, విమర్శలు చేసుకొనే స్థాయి దాటి, కొట్టుకునే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. అప్పటలో తెలంగాణ ప్రజలకు వెంకయ్య నాయుడు ప్రాణం పోసి బతికించారు. ఇప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు మాదిరి సీమాంద్ర ప్రాంతం వైపు వెంకయ్య నాయుడు ఫ్రాణదాత గా చూస్తున్నారు. అంటే మరోసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తున్నారని .. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు కేంద్రం తెలంగాణ బిల్లును ఎలాగైన లోక్ సభలో, రాజ్యసభలో ఆమోదం పొందే విధంగా కుట్రలు, కుతంత్రాలు, విందులు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు అయిన బిజేపి పార్టీపైనే ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు కమలనాధులకు.. ‘‘ముందు గొయ్యి..వెనక నూయ్యి’’మాదిరిగా ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని కిషన్ రెడ్డి, బండారు దత్తత్రేయ, విద్యాసాగర్ లాంటి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఉంటేనే కమలం వికస్తుంది, లేకపోతే.. పూర్తిగా వాడిపోతుందని పార్టీకి పెద్దల ముందు విన్నవించటం జరిగింది. ఇప్పుడు పార్టీ పెద్దలు తెలంగాణ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అయోమయంలో .. తెలంగాణ బిజేపి నాయకులు ఆందోళన చెందుతున్నారు.
కమలం పెద్దలు మాత్రం చంద్రబాబు సరసం, కాంగ్రెస్ తో కామాక్రీడ ఆడేందుకు సిద్దమువుతున్నారు. చంద్రబాబునాయుడు తో సరసం చేసిన .. వెంకయ్యనాయుడు .. సమైక్యవాదులకు ప్రాణం పోసే బ్రహ్మగా ..రోజుకోక రాజకీయ ప్రకటన చేస్తున్నారు. ‘‘చంద్రబాబుతో దొస్తీ కట్టిన వారు.. చరిత్రలో బాగుపడ్డట్టు ఎక్కడలేదని .. బీజేపి నాయకులే అంటున్నారు’’
అలాంటి టినాయకుడు మోడీతో ముద్దు ముచ్చట్లు పెట్టుకొని, 2014లో సరికొత్త రాజకీయ కాపురానికి తెరలేపుతున్నరనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మోడీతో పరిచయం, వెంకయ్యనాయుడుతో సంబంధమే .. సమైక్యం వైపు బీజేపి నాయకులు అడుగులు వేస్తున్నరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ, సీమాంధ్రలో రెండు చోట్లా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందా? అందులో భాగమేనా పార్టీకి చెందిన సీనియర్ నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ వెంకయ్యనాయుడిని దుయ్య బట్టడం చూస్తే.. ‘‘తెలంగాణ, సీమాంద్ర ప్రాంతాల కంటే ’’ ముందుగా పార్టీ లోని నాయకులు విడిపోయే అవకాశాలు కనబడుతున్నట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత వెంకయ్యనాయడిపై ఉందని పార్టీ పెద్దలే అంటున్నారు. అందువల్ల ఇందుకోసం కాంగ్రెస్-కిరణ్ వ్యవహారం మాదిరిగానే భాజపా వెంకయ్య వ్యవహారాన్ని తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర తరపును భాజపాలో పోరాడుతున్న వ్యక్తిగా వెంకయ్యను చిత్రీకరించడం ఆ వ్యూహం లక్ష్యం.
అసలు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ మంత్రి జైరామ్ రమేష్ పార్టీ అధిష్టానంతో చర్చలు అన్నపుడు భాజపా కావాలనే వెంకయ్యను ముందుకు పెట్టిదనే విమర్శలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు పార్టీలో వెంకయ్యకు శత్రువు సంఖ్య భారీ పెరుగుతుంది. చివరకు .. నడవలేని నాగం జనార్థన రెడ్డి కూడా వెంకయ్యనాయుడు పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
అంతేకాకుండా నాగం జనార్థన రెడ్డి, వెంకయ్యకు చిన్న ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ తీర్మానం కాకినాడలో చేసినపుడు వెంకయ్య కూడా వేదికపైనే వున్నారని గుర్తుచేసారు. అంటే వెంకయ్య వేసుకున్న సమైక్య ముసుగును తీసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వెంకయ్య ఎవరికి దాహం తీర్చుతాడో, ఎవరిని ఎండగడతడో, లేక.. చంద్రబాబు (రెండుకళ్ల సిద్దాంతం) మాదిరి .. నాకు రెండు ప్రాంతాలు.. నా రెండు చేతులతో సమానం అని నినాదం చేస్తాడో, చూడాలని పార్టీలోని ఇరుప్రాంతాల కార్యకర్తలు అంటున్నారు.
ఇప్పుడు బిజేపి పార్టీలో వెంకయ్య పరిస్థితి.. ‘‘విడవమంటే.. కప్పకు కోపం.. కరవమంటే పాము కోపం’’లాగా ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే ఈ సమస్య నుండి బయటపడేయమని.. వెంకయ్య నాయుడు .. ఇంట్లో రహస్య పూజలు చేయిస్తున్నట్లు.. రాష్ట్ర బిజేపి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
అయిన వెంకయ్య నాయుడు తెలంగాణ బిల్లు చదివిన తరువాత మా నిర్ణయం చెబుతాం, అని తెలంగాణ పల్లవి, సమైక్యరాగం పాడుతున్నారని రాజకీయ మేథావులు అంటున్నారు.
కొసమెరుపు: పోయిన ప్రాణం మళ్లీ వస్తుందనే ఆశతో దింపుడుకళ్లెం పిలుస్తారు, అలా ఎన్నిసార్లు పిలిచిన.. పోయిన ప్రాణం మళ్లీ వెనక్కి రాదు. అనేది సత్యమో.. ఇప్పుడు .. తెలంగాణ అనేది చివరి దశలో ఉంది.. ఇప్పుడు ఎంతమంది వయసు ముదిరి, కొమ్ములుతిరిగిన వాళ్లు వాచ్చి సమైక్యం అని కోటి సార్లు పిలిచిన.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వటం ఖాయం అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి, రాజకీయ నాయకులు కొత్త సమస్యలు వెతుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more